BigTV English
Advertisement

Passenger: రైల్లో సెల్ ఫోన్ దొంగతనం, రెండు కాళ్లు కోల్పోయిన ప్రయాణీకుడు!

Passenger: రైల్లో సెల్ ఫోన్ దొంగతనం, రెండు కాళ్లు కోల్పోయిన ప్రయాణీకుడు!

Indian Railways: నార్త్ ఇండియాలో గత కొద్ది కాలంగా రైళ్లలో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైలు డోర్లు, కిటికీల దగ్గర కూర్చున్న ప్రయాణీకులను టార్గెట్ చేసి దొంగలు ఫోన్లను కొట్టేస్తున్నారు. క్షణాల్లో ఫోన్లు దొంగిలించి కొంత మంది కదులుతున్న రైల్లో నుంచి బయటకు దునికేస్తున్నారు. మరికొంత మంది రైల్వే స్టేషన్ లోనే నిలబడి కదులుతున్న రైల్లోని ప్రయాణీకుల ఫోన్లను లాక్కుంటున్నారు. తాజాగా సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు సెల్ ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయాణీకులు చితకబాదినా, ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.


సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ, రెండు కాళ్లు కోల్పోయిన ప్రయాణీకుడు

తాజాగా మొబైల్ ఫోన్ దొంగతనం కారణంగా కదులుతున్న రైలు నుంచి పడి కాలు పోగొట్టుకున్న ఘనట మహారాష్ట్రలో జరిగింది. సెంట్రల్ రైల్వే లై న్‌లోని షాహద్- అంబివాలి స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. తాజాగా గౌరవ్ నిఖమ్ అనే యువకుడు రైలు ఎక్కాడు. డోర్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో బయటి నుంచి ఓ దొంగ అతడి సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఆ సమయంలోనే తను ఫోన్ పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దొంగ కిందికి గుంజడంతో అతడు పడిపోయాడు. కాళ్లు రెండు రైలు కిందికి వెళ్లాయి. వాటిలో ఒక కాలు నుజ్జు నుజ్జు కాగా, మరో కాలుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.


గౌరవ్ ను హాస్పిటల్ కు తరలించిన రైల్వే పోలీసులు

ఈ ఘటన గురించి తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పాట్ కు చేరకున్నారు. తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉన్న గౌరడ్ ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. “ఎవరో నా చేయి లాగి ఫోన్‌ను లాక్కున్నారు. నేను ఫోన్ ను గట్టిగా పట్టుకున్నాను. డోర్ ను పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేకపోయాను. పట్టు కోల్పోయి పట్టాల మీద పడిపోయాడు” అని గౌరవ్ తెలిపాడు. ఆయన రెండు కాళ్లు గాయాలు కాగా, ఓ కాలు పూర్తి నుజ్జు నుజ్జు అయ్యింది.

Read Also: వీడు ఎవడండి బాబు.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఏకంగా కారుతో వచ్చేశాడు!

దొంగ కోసం పోలీసులు గాలింపు

అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడి కోసం వెతుకుతున్నారు. నిజానికి ముంబై రైల్వే నెట్‌ వర్క్‌ లో మొబైల్ ఫోన్ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి.  జనవరి 2023- మే 2025 మధ్య 26,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడినట్లు GRP డేటా వెల్లడించింది. ఈ సంఖ్య 2023లో 12,159 ఉండగా,  2024లో 10,891కి దాదాపు 10 శాతం తగ్గింది. మే 2025 నాటికి, సబర్బన్ నెట్‌ వర్క్‌ లో 3,508 దొంగతనాలు నమోదయ్యాయి.

Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!

Related News

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

Big Stories

×