E-Paper
Advertisement

Mizoram Train: ఐజ్వాల్ కు తొలి రైలు.. జెండా ఊపి ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ!

Mizoram Train: ఐజ్వాల్ కు తొలి రైలు.. జెండా ఊపి ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ!

Indian Railway: 

భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వతంత్ర భారతంలో మొదటిసారిగా మిజోరాంను రైలు తాకబోతోంది. రాజధాని ఐజ్వాల్‌ ను దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయబోతోంది. ఈ రైలు ప్రారంభంలో ఐజ్వాల్‌ ను అస్సాంలోని సిల్చార్‌ కు కలుపుతుంది. తర్వాత అక్కడి నుంచి మొత్తం దేశంతో అనుసంధానించబడుతుంది. ఈ రైలును శనివారం నాడు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 19 నుంచి వీకెండ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ- మిజోరం మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందించే ఈ రైలు గంటకు సగటున 57.81 కి.మీ వేగంతో నడుస్తుంది. మొత్తం 43 గంటల 25 నిమిషాల్లో 2,510 కి.మీ ప్రయాణిస్తుందని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు వెల్లడించారు.

మిజోరం- న్యూఢిల్లీ ఎక్స్‌ ప్రెస్ షెడ్యూల్‌ వివరాలు  

సెప్టెంబర్ 13 ప్రారంభోత్సవం రోజున, 20 కోచ్‌ల రైలు తాత్కాలికంగా ఉదయం 10 గంటలకు మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న సైరంగ్ స్టేషన్ నుండి ప్రారంభం అవుతుంది.  సోమవారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అయితే, నోటి ఫై చేసిన రైలు(రైలు నంబర్ 20597) సాధారణ సేవలు సెప్టెంబర్ 19 నుంచి సాయంత్రం 4:30 గంటలకు సైరంగ్ నుంచి ప్రారంభమవుతాయి. ఇది సెప్టెంబర్ 21న ఉదయం 10:50 గంటలకు ఆనంద్ విహార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, అదే రోజు(రైలు నంబర్ 20598)  సాయంత్రం 7:50 గంటలకు ఆనంద్ విహార్ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం 3:15 గంటలకు సైరంగ్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

మొత్తం 21 స్టేషన్లలో హాల్టింగ్!

సైరంగ్,  ఆనంద్ విహార్ మినహా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగుతుంది.  గౌహతి, న్యూ కూచ్ బెహార్, న్యూ జల్పైగురి, మాల్డా టౌన్, భాగల్పూర్, పాట్నా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, కాన్పూర్ సహా మొత్తం 21 స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. “బైరబి నుండి సైరంగ్ వరకు కొత్త లైన్ ఇంకా విద్యుదీకరించబడనందున బైరబి నుంచి గౌహతికి డీజిల్ లోకోమోటివ్ ఉపయోగించబడుతుంది. గౌహతిలో డీజిల్ లోకోమోటివ్ స్థానంలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వస్తుంది. అక్కడి నుంచి ఆనంద్ విహార్ వరకు ఎలక్ట్రిక్ లోకో మోటివ్ రైలును తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు.

Read Also: వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్లలో నేరుగా వెళ్లిపోవచ్చు!

మరో రెండు రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

సైరంగ్-ఆనంద్ విహార్ వీక్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ తో పాటు, ప్రధానమంత్రి మోడీ మరో రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. సైరంగ్-గౌహతి మధ్య రోజువారీ ఎక్స్‌ ప్రెస్ రైలు, సైరంగ్- కోల్‌ కతా మధ్య మూడు వారాల రైలును ఆయన ప్రారంభించనున్నారు.

Read Also:  ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×