E-Paper
Advertisement

Sleeper Coaches: సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ 6 రైళ్లలో స్లీపర్ బోగీల సంఖ్య పెంపు!

Sleeper Coaches: సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ 6 రైళ్లలో స్లీపర్ బోగీల సంఖ్య పెంపు!

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లలో స్లీపర్ కోచ్ లను తగ్గించి, ఏసీ కోచ్ లను పెంచిన నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో స్లీపర్ కోచ్‌లను పెంచాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రాకపోకలు కొనసాగించే ఎంతో మంది ప్రయాణీకులకు లాభం కలగనుంది.

స్లీపర్ కోచ్ లు పెంచిన రైళ్లు ఇవే!

⦿ హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-హైదరాబాద్‌ మధ్య రాకపోపలు కొనసాగించే ముంబై ఎక్స్ ప్రెస్ లో(22731/22732 సెప్టెంబరు 23, 26 తేదీల నుంచి 2 స్లీపర్ కోచ్ లు జత చేయనున్నారు.

⦿ ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై- హైదరాబాద్, హైదరాబాద్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ముంబై మధ్య నడిచే   హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ (12701/12702)లో సెప్టెంబరు 24, 25 తేదీల నుంచి 2  స్లీపర్‌ బోగీలు పెరగనున్నాయి.

⦿ సికింద్రాబాద్‌- భువనేశ్వర్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే  విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ (17016/17015)లో సెప్టెంబరు 23, 25 తేదీల నుంచి 3 చొప్పున స్లీపర్‌ బోగీలు పెరగనున్నాయి.

Read Also: విశాఖకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్, మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చూడండి!

ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు

ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ, తమిళనాడు, కేరళ మధ్య నడుస్తున్న ఆరు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

ప్రస్తుతం సోమవారాల్లో నడిచే నడిచే (రైలు నెం. 07191) కాచిగూడ–మధురై స్పెషల్, ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు నడుస్తుంది. బుధవారం నాడు తిరుగు ప్రయాణం అయ్యే (రైలు నెం. 07192) మధురై–కాచిగూడ స్పెషల్, ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు నడుస్తుంది.

హైదరాబాద్–కొల్లం స్పెషల్(రైలు నెం. 07193) ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 07194) కొల్లం–హైదరాబాద్ స్పెషల్, ఆగస్టు 18, అక్టోబర్ 13 మధ్య సోమవారాల్లో నడుస్తుంది.

ఇక హైదరాబాద్–కన్యకుమారి స్పెషల్ (రైలు నెం. 07230) ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8 వరకు బుధవారాల్లో నడుస్తుంది. కన్యకుమారి–హైదరాబాద్ స్పెషల్(రైలు నెం. 07229) ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 10 వరకు శుక్రవారాల్లో నడుస్తుంది. తమిళనాడు, కేరళ, హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.

Read Also:  ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×