E-Paper
Advertisement

Special Trains: ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు, పండుగ రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Special Trains: ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు, పండుగ రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

SCR Special Train:

పండుగ రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 24న మచిలీపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు (07642)ను అందుటులోకి తీసుకు రాగా, ఇదే రైలు చర్లపల్లి-మచిలీపట్నం మధ్య తిరుగు ప్రయాణం (07641) అక్టోబర్ 26న ప్రారంభం కానుంది. ఈ రైలె గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడే, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

చర్లపల్లి- బరౌని మధ్య ప్రత్యేక రైలు

అటు రైలు నంబర్ 07093 చర్లపల్లి- బరౌని మధ్య అక్టోబరు 25న నడుస్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బరౌని-చర్లపల్లి మధ్య(07094) అక్టోబర్ 27 న నడుస్తుంది. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, రాంచీ, మూరి, బొకారో స్టీల్ సిటీ, ధన్‌ బాద్, చిత్తరంజన్, మధుపూర్, జాసిదిహ్ స్టేషన్లలో రెండువైపులా ఆగుతాయి.

నాందేడ్- పానిపట్ మధ్య ప్రత్యేక రైలు

Advertisement

అటు నాందేడ్- పానిపట్ ప్రత్యేక రైలు(07635)  అక్టోబర్ 29, నవంబర్ 3 మధ్య నడుస్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (07636) పానిపట్- నాందేడ్ మధ్య అక్టోబర్30 నుంచి నవంబర్ 4 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు పూర్ణ, పర్భాని, జల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సి, రాణి కమలాపతి, బినా, ఝాన్సీ, ఆగ్రా కాంట్, మధుర, కోసి కలాన్  స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.

Read Also:  పండుగ వేళ 973 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!

ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు   

Advertisement

అటు పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు కంటోన్మెంట్, కలబురగి మధ్య ప్రత్యేక రైలు సేవను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి(06203) రైలు అక్టోబర్ 25న, కలబురగి–యశ్వంత్‌పూర్(06204) రైలు అక్టోబర్ 26న నడుస్తుంది.  బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి రైలు (06207) అక్టోబర్ 27న, కలబురగి–బెంగళూరు కంటోన్మెంట్ రైలు(06208) అక్టోబర్ 28న నడవనుంది. బెంగళూరు కంటోన్మెంట్–కలబురగి రైలు(06209) అక్టోబర్ 28న, కలబురగి–బెంగళూరు కంటోన్మెంట్ రైలు(06210) అక్టోబర్ 29న నడుస్తుందని అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇబ్బంది లేకుండా ప్రయాణించాలన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×