ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో చక్కటి టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. శ్రీ రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్ర పేరుతో దీన్ని పరిచయం చేసింది. 10 రోజుల ప్రత్యేక యాత్ర భారత్ గౌరవ్ రైల్లో కొనసాగనుంది. ఈ పర్యటనలో సౌత్ ఇండియాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. IRCTC రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు కొనసాగుతుంది. నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 16న ముగుస్తుంది. ఇది దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రను ఎంజాయ్ చేయాలనుకునే వారికి బాగుటుంది. ఈ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో పర్యాటకులు దర్శించుకునే పుణ్యక్షేత్రాలు ఇవే..
రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్రకు సంబంధించి ఛార్జీల వివరాలను IRCTC ప్రకటించింది. ఇంతకీ ఎవరికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ యాత్రలో పాల్గొనే పెద్దలకు స్లీపర్ క్లాస్ రూ. 18,040, 3AC – రూ. 30,370, 2AC – రూ. 40,240గా నిర్ణయించింది. పిల్లలకు (5-11 సంవత్సరాలు) స్లీపర్ క్లాస్ – రూ. 16,890, 3AC – రూ. 29,010, 2AC – రూ. 38,610గా ఫిక్స్ చేసింది. ఈ ఛార్జీలో భాగంగా రైలు ప్రయాణం, భోజనం, వసతి, స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది.
ప్రయాణికులకు AC, నాన్-AC ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ హోటళ్లలో సౌకర్యవంతమైన వసతి కల్పించబడుతుంది. లభ్యత, వాతావరణాన్ని బట్టి స్థానిక సందర్శనా స్థలాలను AC, నాన్-AC బస్సుల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా సౌకర్యవంతమైన రైలు ప్రయాణం, శుభ్రమైన హోటళ్లలో వసతి, ప్రయాణం అంతటా స్వచ్ఛమైన శాఖాహార భోజనం, ప్రతి గమ్యస్థానంలో స్థానిక సందర్శనా స్థలాలకు తీసుకెళ్లతారు.
Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!
ఈ యాత్ర కేవలం ఆలయాల దర్శనం మాత్రకే కాదు, సంస్కృతి, సమాజం, ప్రశాంతతను కోరుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. అందమైన మార్గాలు, చారిత్రాత్మక పట్టణాల గుండా ప్రయాణించడం ద్వారా, దక్షిణ భారత ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని అనుభవిస్తారు. ఈ టూర్ కు సంబంధించిన టికెట్లను IRCTC వెబ్ సైట్ ద్వారా లేదంటే IRCTC ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నేరుగా బుకింగ్ లు చేసుకోవచ్చు.
Read Also: రాజస్థాన్ లో న్యూ ఇయర్ టూర్.. IRCTC ప్లాన్ అదుర్స్ అంతే!