Maternal Healthcare: స్వేచ్చ బ్యూరో: మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రం సాధించిన ఫలితాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసిందని సోమవారం ఆమె వెల్లడించారు.
ఈ నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన హాస్పిటళ్లలో నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరణ, మిడ్వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Also read: El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?
అలాగే అధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అత్యాధునిక పరికరాలతో పర్యవేక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్కు అనుగుణంగా తీర్చిదిద్ది, నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ సర్టిఫికేషన్ పొందేలా మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.ఈ ప్రోత్సాహక నిధులు రాష్ట్రంలో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను మరింత తగ్గించడంతో పాటు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన మాతా-శిశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడుతాయని డాక్టర్ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు.
Also Read: Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!