BigTV English

AP metro projects 2025: విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో.. విజయవాడలో స్పీడ్ రైడ్.. ముహూర్తం ఫిక్స్!

AP metro projects 2025: విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో.. విజయవాడలో స్పీడ్ రైడ్.. ముహూర్తం ఫిక్స్!

AP metro projects 2025: ఏపీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో పెద్ద విప్లవం రానుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు మొదలవుతున్నాయన్న వార్త ఇప్పుడు పెద్ద ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ప్రభుత్వం జూలై 25, 2025న టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుల అంచనా ఖర్చు రూ. 39,362 కోట్లు అని అధికారులు చెబుతున్నారు. 2 నగరాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కోసం ఈ మెట్రో ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.


☀విశాఖ మెట్రో ప్రాజెక్ట్.. 20 కిమీ డబుల్ డెక్కర్ కారిడార్
విశాఖపట్నం, ఏపీ తూర్పు తీరంలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో వాణిజ్యానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ రోజు లక్షలాది మంది ప్రయాణికులు బస్సులు, క్యాబ్ లు, ఆటోలతో ఆధారపడి ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో మెట్రో రైలు అనేది విశాఖకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం విశాఖ మెట్రో మొత్తం 20 కిలోమీటర్ల పొడవు గల డబుల్ డెక్కర్ కారిడార్ రూపకల్పన చేయబడుతోంది. ఇందులో రహదారి, మెట్రో ఒకేసారి ఉండే మల్టీ లేయర్ ఫ్లైఓవర్ డిజైన్‌ను అనుసరిస్తారు. దీని వల్ల నగరంలో బస్సులు, ఇతర వాహనాలకు వేరే స్థలం ఉంటే మెట్రో పై లేయర్‌లో సాఫీగా నడుస్తుంది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక విశాఖ రైల్వే స్టేషన్ నుండి RTC కాంప్లెక్స్ వరకు, అనంతగిరి ప్రాంతాల దాకా కనెక్టివిటీ మరింత సులభమవుతుంది. పర్యాటకులకు బీచ్ రోడ్, కైలాసగిరి వంటి ప్రముఖ ప్రాంతాలకు వెళ్లడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.


☀విజయవాడ మెట్రో ప్రాజెక్ట్.. 4.7 కిమీ తొలి దశ
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్, బిజీ ట్రేడ్ సెంటర్ గల నగరంగా విజయవాడను చెప్పవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి 4.7 కిమీ పొడవు గల మొదటి దశ మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ తొలి దశలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) నుండి బెంజ్ సర్కిల్, మొగల్రాజపురం వరకు కనెక్టివిటీ ప్రణాళికలో ఉంది. తరువాత దశల్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో లైన్‌ను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ మెట్రో వలన ముఖ్యంగా బస్టాండ్ – రైల్వే స్టేషన్ మధ్య ప్రయాణం మరింత వేగంగా, కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది ప్రయాణికులకు, ఉద్యోగులకు సమయాన్ని సేవ్ చేస్తుంది.

☀ఈ నగరాలకు మెట్రో వలన లాభాలేమిటి?
ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. రోడ్లపై బస్సులు, క్యాబ్లు, ఆటోలు తక్కువవుతాయి. కాలుష్యం తగ్గుతుంది.. ఎలక్ట్రిక్ ఆధారిత మెట్రో వలన కార్బన్ గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా గంటపాటు ట్రావెల్ చేస్తే, మెట్రో ద్వారా 15 నుండి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ముఖ్యంగా విశాఖలోని పర్యాటక స్పాట్లను సులభంగా చేరుకోవడానికి మెట్రో బాగా ఉపయోగపడుతుంది. మెట్రో లైన్ పరిధిలో రియల్ ఎస్టేట్ పెరిగి ఆస్తుల విలువలు పెరుగుతాయి.

Also Read: IRCTC Tourism Packages: IRCTC కొత్త ప్యాకేజ్.. సికింద్రాబాద్ నుంచే స్పెషల్ ట్రైన్.. ఈ ట్రిప్ మిస్ కావద్దు!

☀కేంద్ర నిధుల అంశం..
ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర నిధులు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టులు సాధారణంగా 50 శాతం రాష్ట్రం, 50 శాతం కేంద్రం పద్ధతిలో నిర్మించబడ్డాయి. కానీ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన చేస్తోంది. కేంద్రం నుంచి తుది గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు.

☀ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయి?
టెండర్లు విడుదలయ్యాక కాంట్రాక్టర్లు ఎంపికవుతారు. అనుకున్న విధంగా జూలైలో టెండర్లు పిలిస్తే, సంవత్సరం చివర్లోనే గ్రౌండ్ వర్క్ మొదలయ్యే అవకాశం ఉంది.
విశాఖలో మొదట బీచ్ రోడ్ ప్రాంతంలో పనులు మొదలయ్యే అవకాశం ఉండగా, విజయవాడలో PNBS – బెంజ్ సర్కిల్ మార్గాన్ని ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నగరాల్లో రోజూ ఉద్యోగాల కోసం, పాఠశాలల కోసం ప్రయాణించే వారందరికీ మెట్రో రైలు ఒక వరం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖలో బీచ్ సైడ్ టూరిజం పెరిగి, పర్యాటకులకు ఫాస్ట్ ట్రావెల్ ఆప్షన్స్ లభిస్తే వ్యాపారాలు కూడా పుంజుకుంటాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

విజయవాడ – విశాఖ మెట్రో ప్రాజెక్టులు నిజంగానే ఏపీ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతాయనడంలో సందేహం లేదు. ట్రాఫిక్ నుంచి విముక్తి, పర్యాటకాలకు బూస్ట్, వాతావరణ రక్షణ.. అన్నీ ఒకే సారి సాధ్యమవుతాయి. ఇప్పుడు అందరి దృష్టి రేపటి టెండర్లపైనే ఉందని చెప్పవచ్చు. ఇంతకు ఇంతటి ప్రతిష్టాత్మక టెండర్లు చేజిక్కించుకొనేది ఎవరో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే!

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×