BigTV English
Advertisement

Watch Video: ఓర్నీ.. రైలు కింద పడ్డా బతికేశాడు, అదెలా? ఇదిగో ఈ వీడియో చూడండి!

Watch Video: ఓర్నీ.. రైలు కింద పడ్డా బతికేశాడు, అదెలా? ఇదిగో ఈ వీడియో చూడండి!

Indian Railways: బీహార్ లో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారి పట్టాల మీద పడిపోయాడు. ఈ ఘటనను చూసి ఇతర ప్రయాణీకులు షాక్ కు గురయ్యారు. ఆయన కచ్చితంగా చనిపోయి ఉంటాడని భావించారు. కానీ, రైలు వెళ్లాక చూస్తే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిజంగా ఆయన అదృష్టవంతుడు అంటూ అందరూ కొనియాడారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బీహార్ లోని సమస్తిపూర్‌ రైల్వేస్టేషన్‌ లోకి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి ఆగింది. అప్పటికే ప్రయాణీకులు రైలు ఎక్కారు. నెమ్మదిగా రైలు ముందుకు కదులుతుండగా, ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టుతప్పి ఫ్లాట్ ఫారమ్ నుంచి జారి పట్టాల పక్కన పడిపోయాడు. ఈ ఘటనను చూసి రైల్వే స్టేషన్ లోని తోటి ప్రయాణీకులు ఆందోళన చెందారు. కానీ, సదరు వ్యక్తి ఫ్లాట్ ఫారమ్ గోడ, రైలు పట్టాల మధ్యలో ఉన్న స్థలంలో పడిపోయాడు. దీంతో స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రైలు ముందుకు వెళ్లగానే కొంత మంది ప్రయాణీకులు దిగి అతడిని ఫ్లాట్ ఫారం మీదకి తీసుకొచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని రైలు ఎక్కించారు. ఆ తర్వాత రైలు అక్కడి నుంచి బయల్దేరింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువు నెటిజన్లు ఆయన లేచిన వేళ బాగుందంటున్నారు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు అంటున్నారు.


Read Also: స్పెషల్ కోటాలో టికెట్ బుకింగ్, కచ్చితంగా కన్ఫర్మ్ కావాల్సిందే! ఇలా ట్రైచేయండి!

కోతుల మధ్య కొట్లాటతో రైళ్ల రాకపోకలకు అంతరాయం  

ఇక రీసెంట్ గా రెండు కోతుల మధ్య గొడవ జరగడంతో సమస్తిపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే స్టేషన్ లోని 4వ నెంబర్ ఫ్లాట్ ఫారమ్ మీద రెండు కోతులకు ఓ అరటి పండు దొరికింది. ఈ పండు కోసం రెండు కోతులు కొట్లాడుకున్నాయి.  అందులో ఓ కోతి అరటిపండును తీసుకొని స్టేషన్ మీదికి ఎక్కింది. దాని వెనకాలే మరో కోతి వెళ్లింది. ఆ అరటి పండు కోతి చేతిలో నుంచి జారీ విద్యుత్ వైర్ల మీద పడిపోయింది. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. తీగల మీద నిప్పు రవ్వలు చెలరేగాయి. వైర్ల నుంచి పొగలు వచ్చాయి. వెంటనే రైల్వే అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు గంట సమయం తర్వాత విద్యుత్ వైర్లను సరిపోయడంతో మళ్లీ యాథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిధిలో కోతులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైల్వే స్టేషన్ అధికారులు కోతులు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది వారాల్లోనే మరో ఘటన జరగడంతో ఈ రైల్వే స్టేషన్ దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.

Read Also: జనరల్ జోలికి వెళ్లొద్దు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సిఫార్సులు!

Related News

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Big Stories

×