Jabardasth:జబర్దస్త్.. దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులకు నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక కామెడీ ఎంటర్టైనర్ షో జబర్దస్త్ (Jabardasth). ఈ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎంతోమంది భవిష్యత్తుకు పునాదిగా నిలిచింది. ముఖ్యంగా ఈ షోలో కమెడియన్లుగా చేసిన ఎంతోమంది సినిమాలలో హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా , రచయితలుగా కూడా దూసుకుపోతున్నారు. ఇంకొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ షోలో కమెడియన్స్ ఎలా అయితే తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారో.. ఇటు జడ్జెస్ కూడా మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తూ షో రేటింగ్ పెంచడమే కాకుండా ప్రతిభావంతులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో నాగబాబు (Nagababu), ఇంద్రజ(Indraja ) జడ్జెస్ గా వ్యవహరిస్తుండగా.. రష్మీ (Rashmi) ఎప్పటిలాగే హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇకపోతే నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదల చేసిన ప్రోమోలో.. జడ్జ్ ఇంద్రజ మాట్లాడుతూ..” ఈ వారం నుంచి ఎవరైతే బెస్ట్ ఐటమ్ ఇస్తారో.. బెస్ట్ రైటర్ ఆఫ్ ది డే విభాగంలో వాళ్లకు నేను రూ.5,000 ఇస్తాను. బెస్ట్ పంచ్ డైలాగ్ ఎవరైతే చెబుతారో వాళ్లకు నాగబాబు గారు వెయ్యి రూపాయలు ఇస్తారు” అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇంద్రజ. మొత్తానికి అయితే ఇంద్రజ ప్రకటించిన ఈ ప్రైజ్ మనీ వివరాలు కంటెస్టెంట్స్ లో మరింత జోష్ పెంచాయని చెప్పవచ్చు.
also read:సుడిగాలి సుధీర్ పై మనసు పారేసుకున్న సీరియల్ హీరోయిన్?
ఇకపోతే ఇలాంటి ఆఫర్.. జడ్జ్ నాగబాబు కూడా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వారికి 5,000 బహుమతిగా ఇస్తానని, ఆయన డబ్బులు కూడా ఇచ్చారు. అయితే ఇదే విషయంపై హైపర్ ఆది కూడా భారీ పంచులు వేశారు. వీళ్లు తమ పెర్ఫార్మెన్స్ తో పైకి ఎదగకపోయినా పర్వాలేదు బాబు గారు.. వీళ్లను ఒక స్థాయికి చేర్చే క్రమంలో వీళ్లకు డబ్బులు ఇచ్చి మీరు డబ్బులేని వాళ్లు మాత్రం కాకండి అంటూ కామెంట్లు చేశారు.
అయితే జడ్జెస్ మాత్రం తాము తీసుకునే రెమ్యూనరేషన్ తో పాటు షో కి టిఆర్పి రేటింగ్ పెంచడానికి ఎంతో కష్టపడుతున్నారు . అంతేకాదు కమెడియన్సు కి మంచి లైఫ్ ఇవ్వడానికి గట్టిగానే పోరాడుతున్నారు. ఏది ఏమైనా అటు జడ్జెస్ ఇటు కమెడియన్ దశాబ్ద కాలానికి పైగా షోని అండర్స్టాండింగ్ తో రన్ చేస్తున్నారు కాబట్టి ఈ షో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.