Intinti Ramayanam Serial : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి రామాయణం సీరియల్ ఇకమీదట కనిపించదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.. గతంలో అనేకసార్లు ఈ సీరియల్ ఇక శుభం కార్డు వేసుకో పోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలు ఎటువంటి నిజం లేదని తెలిసింది. కానీ మళ్లీ వార్తలు ఇలాంటివి రావడంతో చాలామంది జనాలు నిజంగానే సీరియల్ కి గుడ్ బై చెప్పేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సీరియల్ కి ఎండు కార్డు పడబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఇందులో నిజం ఎంత ఉందో అన్నది పక్కన పెడితే ఈ సీరియల్కు ఈ మధ్య పెద్దగా రేటింగ్ కూడా రాలేదు అని తెలుస్తుంది.. దీనివల్లే సీరియల్ ఇకమీదట కనిపించదు అని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు వచ్చిన వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అన్నది మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు ఈ సీరియల్ టాప్ లోనే కొనసాగింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ రేటింగ్ కాస్త డౌన్ అయిన విషయం అందరికీ తెలిసిందే.. అందుకు కారణం పల్లవి మారిపోవడమే అని కొందరు అభిప్రాయపడితే, మరికొందరు మాత్రం ఈ స్టోరీ పెద్దగా ఆకట్టుకునేలా లేదు చప్పగా ఉంది అంటూ కామెంట్లు కురిపించారు.. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి ఎక్కువ రేటింగ్ కూడా రాలేదన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు పల్లవి సమస్య తీరిపోవడంతో అవనీతో కలిసిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అనడంతో అవనీను మారిపోవడం నాకు కూడా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇంట్లో వరుసగా గుడ్ న్యూస్ లు వినిపించడంతో ఈ సీరియల్కు శుభం కార్డు పడుతుందా? అన్న అనుమానాలు కూడా అభిమానులు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మొదలైన ఈ స్టోరీ ఇప్పుడు ఎండ్ అవుతుంది అంటే చాలామంది ఫీల్ అవుతున్నారు. దీని గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఇంటింటి రామాయణం సీరియల్ ప్రస్తుతం కాస్త సంతోషంగా మరి కాస్త బాధగా స్టోరీ తో కొనసాగుతుంది. పల్లవి మారిపోవడం అందరిని సంతోషంగా ఉంచుతుంది. కమల్ తింగరితనం వల్ల బిజినెస్ లో లాస్ అయ్యేలా చేస్తాడు.. ఇక అవనీని కూడా అక్షయ్ఆఫీస్కి రమ్మని చెప్పడంతో ఆ మాట విన్న భానుమతి అవని ఆఫీస్ కి వెళ్తుంది అంటే నువ్వు కూడా వెళ్లాలి కదా అని కండిషన్ పెడుతుంది. కానీ పల్లవి మాత్రం నాకు ఆస్తులు అంతస్తులు వీటిమీద ఇష్టం లేదు అమ్మమ్మ. అవని అక్క ఏం చేస్తే అదే గ్రేటు అంటూ తనని పొగిడిస్తూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది భానుమతి. కానీ భానుమతి మాత్రం నా మనవరాలికి కూడా ఆఫీస్ కి వెళ్లే అవకాశం రావాలి అని అనుకుంటుంది కానీ పల్లవి అలా అనడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.. ఇక ముందు ఎపిసోడ్ లో చక్కగా పల్లవిని చైర్మన్గా చేయాలి అని అనుకుంటాడు కానీ పల్లవి మాత్రం నాకు ఆ బిజినెస్ గురించి అవసరం లేదు నాన్న అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. బుధవారం ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి..