Karthika Deepam2 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కార్తీకదీపం… ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు రోజురోజుకీ క్రేజీ పెరుగుతూ వస్తుంది.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ గా ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారమవుతుంది.. ఆ సీరియల్ తో పోలిస్తే ఇప్పుడు ప్రసారం అవుతున్న సీక్వెల్ పార్ట్ పై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే కార్తీకదీపం సీరియల్ లో మౌనిత విలన్ పాత్రలో నటించగా ఇప్పుడు ఈ సీరియల్ లో జ్యో విలన్ గా అందరినీ ఆకట్టుకుంటుంది.. డాక్టర్ బాబు వంటలకని ఎప్పుడెప్పుడు విడకూడదా మా అన్న కసితో ఈమె ఉంటుంది.. ఈ సీరియల్కు డాక్టర్ బాబు వంటలక్క ఎంతగా ఫేమస్ అయ్యారో అలాగే తన మరదలు పాత్రలో నటించిన జ్యో కూడా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది..
విలన్ గా జనాలతో ట్రోల్స్ వేయించుకుంటున్నా ఈ జో పాత్రలో నటించింది గాయత్రి.. అయితే ఇప్పుడు ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే కార్తీక్ మరదలు ఇకమీదట కనిపించదా? మరి ఇందులో విలన్ పాత్రలో ఇంకొక కొత్త యాక్టర్ కనిపిస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్ లు ఎలా ఉండబోతాయి అని ఫాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి నిజంగానే జోత్స్న ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన కార్తీకదీపం సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలు డాక్టర్ బాబు వంటలక్క ఇక కలవర అన్న సస్పెన్స్ తోని స్టోరీ మొత్తం సాగింది.. ఇప్పుడు రెండవ పార్ట్ లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే విలన్ విడగొట్టాలని చూస్తుంది. మరి వాళ్ల నుంచి తప్పించుకొని ఈ జంట ఎలా ముందుకు సాగుతుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. ఇందులో విలన్ గా జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి నటించింది. ఈమె గతంలో పలు షోలకు యాంకర్ గా వ్యవహారించింది. ఇప్పుడు ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది.. అయితే ఈ వార్తలు పై కార్తీకదీపం టీం అయితే ఎక్కడ స్పందించలేదు.. నిజంగానే ఈమె ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోతుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ రోల్ చేస్తున్న జ్యోత్స్న అసలు పేరు గాయత్రి సింహాద్రి… ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఒక్కు సీరియల్తో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలని తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది. కు చెందిన ఈ ముద్దుగుమ్మ చదువుని పూర్తి చేసి నటిగా మోడల్గా తన కెరియర్ ని ప్రారంభించింది.. కెరీర్ మొదట్లో తను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న కూడా ఆ తర్వాత మంచి అవకాశాలు రావడంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.. 2022లో తెలుగు ఛానల్లో ప్రసారమైన ‘త్రినయని’ సీరియల్తో బుల్లితెరపై తన నట జీవితాన్ని ప్రారంభించింది.. ఆ తర్వాత పల్లకిలో పెళ్లికూతురు సీరియల్ లో కూడా నటించింది.. ఇప్పుడేమో కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె ఒక్క రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి..