Gundeninda GudiGantalu Today episode August 11th : రోహిణి నన్ను మోసం చేసింది. నా పక్కనే ఉంటూ నన్ను ఇంతగా వాడుకొని ద్రోహం చేసింది. అని మనోజ్ బాధపడడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడతారు.. అసలు మనోజ్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం అమ్మే అని బాలు అంటాడు.. నీకు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా.. మనోజ్ పరిస్థితి బాగోలేదు తనని తీసుకొని వెళ్లి పడుకోబెట్టు అని బాలు తో సత్యం చెప్తాడు.. ఇక మనోజ్ నన్ను రోహిణి మోసం చేసింది నాన్న నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది నాన్న అని బాధ పడిపోతూ ఉంటాడు.. పైకి బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టగానే బాలు నన్ను రోహిణి మోసం చేసింది రా అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు.. సత్య మాత్రం నా కొడుకులు ఇలా మారిపోతారు అని నేను అనుకోలేదు అని బాధ పడిపోతూ ఉంటాడు.. బతికుండంగా ఇలా చూస్తూ ఉండాలని నేను అసలు ఊహించలేదు శాశ్వతంగా కళ్ళు మూసుకుంటే తప్ప నాకు ఈ బాధ దూరం కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. మా అమ్మ వస్తే ఈ పరిస్థితిని చక్క దిద్దుతుంది అని చెప్పగానే అవును నాన్న ఇలాంటి తీసుకొని వస్తే బాగుంటుంది అని బాలు అంటాడు..
మనోజ్ బయటికి వెళ్తుంటే మీనా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది.. అమ్మ ఎక్కడున్నావ్ అని మనోజ్ అడగడంతో.. మీ అమ్మగారు ఇంట్లో లేరన్న విషయం మీకు తెలియదనుకుంటాను అని నేను అంటుంది. ప్రభావతి ఇంట్లో లేకపోయినా సరే మనోజ్ ది ఇలా ప్రవర్తిస్తున్నాడు అని నేను ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా తింటారా వండి పెట్టమంటారా అని మీనా అడుగుతుంది కానీ నాకు ఏం వద్దు అని మనోజ్ అంటాడు. మీరు తాగేసి పడిపోతే మీ తమ్ముడు మిమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు అని మీనా చెప్తుంది.. ఇక మనోజ్ నేను బయటకు వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు.. వెంటనే బాలు రావడంతో మీరు వచ్చారా మీ అన్నయ్య ఏమో మళ్లీ వచ్చాడేమో అనుకున్నాను అని అంటుంది.
బాలు ఇంట్లోకి రాగానే భోజనం తీసుకుని వస్తాడు.. మనోజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెప్పగానే ఈ టైంలో వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు బాలు.. కానీ బాలు మనోజ్ కూడా లేడు కదా ఇప్పుడు ఆ గదిలో ఎవరూ ఉండరు కదా మనం వెళ్దామని అనగానే.. వాళ్లు గదిలో ఏవేవో ఉంటాయండి వాళ్ళు లేనప్పుడు మనం వెళ్తే బాగోదు కదా అని మీన ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినకుండా వెళ్లి వెతకాల్సిందే ఏమైనా రహస్యాలు బయటపడతాయేమో అని అంటాడు. కానీ మీనా మొదట వద్దని ఎంత చెప్తున్నా సరే బాలు తప్పదు అని చెప్పడంతో అక్కడికి వెళుతుంది.. ఆ గదికి గడియ పెట్టి తెలుసు మేడం ఫోన్ చేస్తుంది. ఆ గదిలో మొత్తం వెతకగా రోహిణి బట్టలలో చిన్నపిల్లలు బట్టలు దొరకడంతో మీనా బాలుకి అనుమానం మొదలవుతుంది.. మనోజే తన కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాడేమో అని బాలు మీనా అనుకుంటారు.. చింటూ సైజులో ఉన్నాయి కాబట్టి ఇవి ఆ చింటూ కోసమే కొన్నట్టున్నాడు అని అనుమానం ఎక్కువవుతుంది..
రోహిణి శృతికి ఫోన్ చేసి తన గురించి చెప్పగానే.. శృతి ఎటువంటి సహాయం చేయదు అని రోహిణికి అర్థం అయిపోతుంది.. శృతి ఎటువంటి సహాయం చెయ్యదు కాబట్టి నేను తనతో మాట్లాడటం కూడా వేస్ట్ అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. అంత ఇంతో మీనానే బెటర్ అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. మీనా నాకు సహాయం చేస్తుంది అని రోహిణి అనగానే విద్య నీ తప్పులని సమర్దిస్తుందని అంటున్నావా అని అనగానే.. రోహిణి అది కూడా నిజమే అంటుంది. రోహిణి ఎలాగైనా సరే బామ్మగారు రాగానే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. బామ్మ గారు వస్తున్నారు కాబట్టి నీకు ఫేస్ టు ఫేస్ వార్నింగ్ లు ఎక్కువగానే ఉంటాయి రెడీగా ఉండు అని విద్య అంటుంది..
షీలా ఇంకా ఇంటికి రాలేదేంటి అని బాలు కంగారు పడిపోతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. తను ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళింది ఇంతసేపు ఏమైంది అని అటు ఇటు తిరుగుతూ బాలు ఆలోచిస్తూ ఉండగా.. మీనా మావయ్య గారి బదులు మీరే వెళ్లి ఉండొచ్చు కదా అని అంటుంది.. అంతలోపే సుశీలమ్మ ఇంట్లోకి రాగానే బాలు షీలా డార్లింగ్ అంటే చాలా సంతోషంగా వెళ్లి తనని లోపలికి తీసుకొని వస్తాడు.. ఇక మనోజు ఎలా ఉన్నారు అని అడిగినా కూడా సుశీలమ్మ అసలు మాట్లాడకుండా వెటకారంగానే సమాధానం చెబుతుంది. ఇక బాలు మనోజ్ అలాగే సత్యం ముగ్గురు కలిసి రోహిణి ప్రభావతుల గురించి అడగ్గానే సుశీలమ్మకి నిజాలు చెప్తారు.. రోహిణి ఎక్కడ అని అడిగినా కూడా మనోజ్ ఏమి సమాధానం చెప్పకపోవడంతో సుశీలమ్మ దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఇక రోహిణి మనోజ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే మనోజ్ ఫోన్ చేయడం చూసి బెట్టు చేస్తుంది రోహిణి. ఏంటి మనోజ్ ఫోన్ చేస్తుంటే నువ్వు మాట్లాడను అని అంటున్నావు. తను ఫోన్ చేసినా నువ్వు మాట్లాడను అని అంటే తను ఇంకా జన్మలో నీకు ఫోన్ చేయడు అని విద్య అంటుంది… మొత్తానికి సుశీలమ్మ ఇంట్లోకి రాగానే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యేలా కనిపిస్తాయి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.