Gundeninda GudiGantalu Today episode August 19th : రోహిణి గదిలో కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది. అక్కడికొచ్చిన మనోజ్ ఎందుకు బాధపడుతున్నావు తిన్నావా అని అడుగుతాడు. తిన్నావా అని అలా మాట్లాడుతున్నావేంటి? నేనంటే నీకు అసలు ఇష్టం లేదా లేకపోతే ఇన్ని రోజులు ఉన్నాయి ఇష్టం ఎటు పోయింది అని అడుగుతుంది.. మనోజ్ మాత్రం నువ్వు చేసిన పనికి నేను చాలా బాధపడి పోతున్నాను నువ్వు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు ఆ మాట వినదు అనే రోహిణి ఇంకాస్త కన్నీళ్లు పెట్టుకుంటుంది. రోహిణి పనికి ప్రతిఫలం దక్కకుండానే అమ్మ తీసేసుకుంది అని అందరూ బాధపడిపోతూ ఉంటారు..
ప్రభావతి రోహిణి వల్ల తను చాలా మారిపోయింది అని అనుకుంటారు. రవి శృతి అలాగే మీనా బాలు ఇద్దరు కూడా.. పైకి వెళ్లి రోహిణిని చాలా దారుణంగా చూస్తున్నారు అత్తయ్య అని మీనా తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. కానీ బాలు మాత్రం రోహిణి ఇంకా ఏదో దాస్తుంది అని అనుమానం క్రియేట్ అయ్యేలా చేస్తాడు. పార్లర్ అమ్మ ఇంకా ఏదో దాస్తుంది అని బాలు అనుకుంటూ ఉంటాడు.. అయితే శృతి మాత్రం నిజంగానే ఏదో ఒకటి ఉంది అని అనుకుంటుంది.. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా మనోజ్ చాటుగా చూస్తూ ఉంటాడు. వీళ్లు రోహిణి గురించి ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాడు మనోజ్.. మనోజ్ రోహిణి గురించి ఇంకా ఏదో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా ఖచ్చితంగా ఇంకేదో దాస్తుంది ఏమో అని అనుకుంటాడు..
మీరు అమ్మ గురించి తప్పుగా ఎవరు అనుకోవద్దు.. అమ్మ మంచిగనే అనింది దాని గురించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అని మనోజ్ ప్రభావతికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.. కానీ ఎంతగా అమ్మ నిద్ర కాపురంలో చిచ్చు పెట్టాలని చూసిన కూడా నువ్వు ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు అని బాలు అంటాడు.. రోహిణి దగ్గర ఏటీఎం కార్డు తీసుకోవడం తప్పు కాదా అని బాలు అడుగుతాడు.. రోహిణి కష్టార్జితం అత్తయ్య తీసుకోవడానికి వీలు లేదు కదా. నాకు ఏమవుతుందో అర్థం కావడం లేదు రోహిణి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు భయంగా ఉంది అని మీనా అంటుంది.. కానీ ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటో కూడా వివరించలేకపోతున్నాము అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనోజ్ మాత్రం అలాంటి మోసగత్తేకు అలానే జరగాలని అంటాడు.
ప్రభావతి కింద కూర్చుని ఉండగా మిగిలిన వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు.. బాలు ప్రభావతి కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు.. బామ్మ ఉయ్యాల తెచ్చినట్టుగా నువ్వు కూడా ఒక ఉయ్యాల తెచ్చావా ఏంటి అని అడుగుతాడు రవి. ఉయ్యాలయితే దీంట్లో పిట్ట పిల్లల్ని మాత్రమే పడుకోబెట్టాలి ఇంత చిన్న దాంట్లో ఎలా పెడతారు అని అంటాడు బాలు. ఆ గాజు బాక్స్ ని చూపించగానే ప్రభావతి ఈ గాజు బాక్స్ నాకెందుకురా నేనేం చేసుకోను.. ఇందులో అడుక్కోడానికేమైనా వెళ్లాలా ఏంటి అని ప్రభావతి కోపంగా అడుగుతుంది. కానీ అందరూ కలిసి అందులో ఏటీఎం కార్డులు వేయగానే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంది. ఎవరి సంపాదన ఎంతో అన్నది మీకు తెలియాలి కదా అందుకే కార్డులు వేస్తున్నాము అని చెప్పగానే రోహిణి సంగతి మీకు తెలియదు అందుకే నేను ఇలా చేశాను అని అంటుంది ప్రభావతి.
ఇంట్లోని వాళ్ళందరూ రోహిణి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే రోహిణి మాత్రం అత్తయ్య చేసింది కరెక్టే అని అంటుంది. అత్తయ్య నా కోసమే ఇలా చేసింది కదా మీరు ఎందుకు ఇంతగా బాధపడిపోతున్నారు అని రోహిణి అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అటు మీనా కూడా షాక్ లో ఉండిపోతుంది.. మిగిలిన వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ గా మాట్లాడితే నువ్వు మాత్రం ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. కానీ రోహిణి మాత్రం అత్తయ్య చేసిందే కరెక్టు అని ఎంత చెప్పినా కూడా అదే మాట పట్టుకొని ఉంటుంది.. ఇక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. మనోజు షోరూం కి వెళ్లి ఈగలు తోలుకుంటూ కూర్చుంటాడు అది చూసిన మనికంట సెటైర్లు వేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : శైలు ప్రగ్నెంట్.. మామను కలుసుకున్న చక్రీ.. మాధవ్ పెళ్లి ఫిక్స్..?