Intinti Ramayanam Today Episode july 25th: పల్లవి నిద్రపోతూ ఉంటుంది అయితే అశ్విన్ తనని పిలిచినట్టు తనతో మాట్లాడినట్టు ఊహించుకుంటుంది. మా నాన్న అన్న మాటలు నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి, భయపెడుతున్నాయి.. అప్పుడే అశ్విన్ ఫోన్ చేయడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే పల్లవి ఈ టైంలో అశ్విన్ ఫోన్ చేస్తున్నాడు. అంటే ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఈ టైంలో వీడు ఫోన్ చేస్తుంటారంటే కచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అందుకే నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. కమల్ బావ తెలిస్తే ఈ టైంలో ఎవరు చేస్తున్నారు ఏంటి అని ప్రశ్నలతో చంపేస్తాడు అని పల్లవి భయపడిపోతూ ఉంటుంది..
అశ్విన్ఎందుకు ఏ టైం లో ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. వీడు నన్ను రోజురోజుకీ టార్చర్ చేస్తున్నాడు అని పల్లవి టెన్షన్ పడిపోదు బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడాలని అనుకుంటుంది.. పల్లవి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి ఫోన్ చేస్తున్నావు ఏం కావాలి నీకు అని అడుగుతుంది ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావ్ ఏం కావాలి? నిన్న నా కోసం చాలా సార్లు ఫోన్ చేశావు కానీ నేను బిజీగా ఉండడంవల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. ఈ టైంలో అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని నేను నీకు కాల్ చేశాను అని పల్లవి తో అశ్విన్ అంటాడు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని పల్లవి అడుగుతుంది.. నీకు నేను మొన్న నగలుచ్చాను కదా ఆ నగలు నాకు మళ్ళీ కావాలి.. వాటికి తాకట్టు పెట్టాలి అవి పది లక్షలు వస్తాయి రావో తెలియదు. వాటి నీకు ఇస్తాను ఆ పదిలక్షలతో పాటుగా నాకు మరొక పది లక్షలు కావాలి అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది. నీకు ఒక అద్భుతమైన పెయింట్ ప్రింట్ పంపిస్తున్నాను అది చూసిన తర్వాత అయినా నువ్వు నాకు డబ్బులు ఇస్తావో లేదో ఆలోచించుకొని అశ్విన్ పల్లవిని బ్లాక్మెయిల్ చేస్తాడు..
వీడికి డబ్బులు ఎలా తీసుకురావాలి అసలు కమలికి వీడికి పరిచయం ఎలా ఏర్పడింది.. అసలు ఇంకో పది లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని పల్లవి కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది.. అయితే వెనకాల నుంచి అవని పల్లవిని పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టింది.. నువ్వా అనగానే ఏమైంది పల్లవి ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు అని అవని అడుగుతుంది.. అవును టైం పదకొండు అవుతుంది నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అవని.. సమస్య ఏంటో చెప్పు ఇప్పుడు దేని గురించి బాధపడుతున్నావు.. అని నాకు అర్థం అవుతుంది అని అవని ఎంతగా అడుగుతున్నా సరే.. పల్లవి మాత్రం నా గురించి నీకెందుకు అని కోపంగా వెళ్ళిపోతుంది. పల్లవి దేని గురించి కంగారు పడుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది.
అక్షయ్ ఉదయం లేవగానే ఏంటి ఇంత టైం అయింది. నేను రాత్రి అవని నేను లేపమని చెప్పాను కదా మరి నన్ను లేపకుండా అలానే వెళ్ళిపోయింది ఏంటి అని అవని అంటూ కేకలు వేస్తూ అక్షయ్ ఒక్కసారిగా బయటికి వెళ్లిపోతాడు.. నన్ను 5:30కే లేపమని చెప్పాను కదా క్లైమేట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా.. మరి నువ్వు ఎందుకు నన్ను లేపలేదు నీకు కోపం వస్తే మనిషిని పట్టించుకోవా అని అక్షయ్ అరుస్తాడు.. నేను ఐదు గంటలకి లేపమని చెప్పాను కానీ మీరు లేవలేదు అని ఒక పేపర్స్ చూపించగానే అక్షయ్ షాక్ అవుతాడు. నేను లేపాను కానీ మీరు లేవలేదు అంటూ మళ్ళీ ఇద్దరూ పేపర్లో మీరు రాసుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. నా మీద ఊరికే అరవద్దు అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అవనీ నీకు కోపం వస్తే ఇలా తీర్చుకుంటావా? నన్ను ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నావు అని అక్షయ్ అనుకుంటాడు.. ఇక చక్రధర్ మంచి కోడలు అంటూ పొగిడేస్తాడు. భరత్ కి ఆస్తులు అప్పగిస్తాను అని ఎంతగా చెబుతున్నా సరే వద్దు మామయ్య అని చెప్తుంది అది విన్న చక్రధర్ సంతోషంగా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ‘ఏ దేవి వరమో నీవు’ మనీష్ ఎమోషనల్ స్టోరీ.. అయ్యో పాపం..