Podarillu Today Episode august 16th: అందరూ రెడీ అయ్యి హాల్లో ఉండగా గాయత్రి వాళ్ళు కూడా రెడీ అయ్యి వస్తారు. అయితే ఇద్దరూ రెడీ అయ్యి రావడంతో మనం అందరం కలిసి గుడికి వెళ్దాము అని గాయత్రి అంటుంది. కానీ గాయత్రీ ఆ మాట అన్న తర్వాత తాయారు గాయత్రి పై సీరియస్ అవుతుంది. అయితే ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అందరం వెళ్లేది గుడికి కదా అని గాయత్రి ఎంత చెప్పాలని చూసినా కూడా తాయారు మాత్రం గాయత్రి కాపురంలో నిప్పులు పోస్తారేమో అని అనుమానంతో మన పూజలు వేరు మన మొక్కులు వేరు వాళ్ళ పూజలు.. వేరు వాళ్ళ మొక్కులు వేరు అని అంటుంది. ఇక మాధవ్ వాళ్లు మీరు వెళ్ళండి. మేము తర్వాత వస్తాము అని అంటాడు..
అందరూ కలిసి గుడికి వెళ్ళగానే అక్కడ తాయారు గుడి పెద్దలతో మాట్లాడుతుంది.. గుడిలో పుట్టి పెరిగిన వాళ్ళు చందా ఇవ్వాలని తెలియదా ఆర్ నారాయణ గాడు తాగుబోతు సచ్చినోడు ఎప్పుడు చందా ఇవ్వలేదు ఈ పూజ చేయించుకోవడానికి వీలు లేదు అని చెప్పండి అని అంటుంది. ఇక తాయారు కుటుంబం పూజకు అని సిద్ధం చేస్తూ ఉండగా.. నారాయణ కుటుంబం మాతో పేరు మీద పూజలు చేయించాలి అని గుడిలోకి వస్తూ ఉండగా.. తాయారు పెద్దలకి చెప్పిన మాటలతో వాళ్ళు నారాయణ కుటుంబాన్ని దారుణంగా అవమానించేలా మాట్లాడుతారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను ఇప్పుడు ఈ గుడికి చందాలు ఎలా ఇవ్వాలి అని నారాయణ అంటాడు. కానీ గుడిలోని పెద్దలందరూ చెబుతున్న సరే నారాయణ మాత్రం అక్కడికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది అందుకే నేను రాలేదు ఇవ్వలేకపోయాను అని అంటాడు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అందరూ కూడా చందా కోసమని డబ్బులు వేస్తారు. ఆఖరికి గాయత్రీ భర్త వినోద్ కూడా వీళ్ళకి సాయంగా నిలవడంతో తాయారు షాక్ అవుతుంది.
గుడిలో పూజ అయిన తర్వాత చక్రిమహాలక్ష్మి ఇద్దరు కూడా అక్కడ ఉన్న పొలాలను చూసి వద్దామని బయటకు వస్తారు. అయితే ఆ పొలాలలో నడవడానికి మహాలక్ష్మికి వీలు కాలేదు కింద పడిపోతుంటే చక్రీ పట్టుకుంటాడు.. అలాగే చక్రీ కూడా కింద పడిపోతూ ఉంటే మహాలక్ష్మి పట్టుకుంటుంది. వీళ్లిద్దరి మధ్య కోపాలు తగ్గిపోయి మళ్లీ ప్రేమ చిగురించేలా కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు.. మహాలక్ష్మి చక్రి బీజా ప్రేమను పెంచుకుంటుంది అని చూసే జనాలు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఇదే కనుక నిజమైతే ఈ జంట అతి త్వరలోనే ఒక్కటే ఎలా కనిపిస్తుంది.
గాయత్రికి ఒడిబియ్యం వడిని పుతుంది తయారు. నాకు పెద్దగా ఈ పద్ధతుల గురించి తెలియదు కాబట్టి మీరు కూడా నాకు ఓడినింపండి పిన్ని గారు అని మహాలక్ష్మి అడుగుతుంది. తాయారుకు ఇష్టం లేకపోయినా సరే తన అల్లుడు చెప్పాడు అని మహాలక్ష్మికి ఓడి నింపుతుంది.. ఇక అంతే కాదు కొన్ని పూజలు వ్రతాలు కూడా చేయాలి అని చెప్పగానే ఎంత కఠినమైన నేను చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది. నీ వల్ల కాదు అని తాయారు ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా నేను చేస్తాను నాకు చెప్పండి అని మొండిగా ఉంటుంది.. మాధవ్ కోసమైనా సరే ఆ ముడుపులను చెల్లించి ఆ పూజలు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందేమో అని మహాలక్ష్మి అనుకుంటుంది..
ఇక గుడిలో పూజలన్నీ అయిపోయిన తర్వాత అందరూ బయట మాట్లాడుకుంటూ ఉండగా.. నారాయణ వినోద్ తో చాలా సీరియస్ గా మాట్లాడుతూ కనిపించడం చూసిన తాయారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. గాయత్రి కూడా తన భర్తకి నిజం చెప్తున్నాడేమో అని టెన్షన్ పడుతుంది కానీ చక్రి అదేం లేదు ఊరికే మీ అమ్మని టెన్షన్ పెట్టడానికి అని అంటాడు. ఇక వినోద్ ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఇద్దరు అని అడుగుతుంది. మాధవ్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పండి అని ఎంతగా బతిమలాడినా చెప్పలేదు అని వినోద్ చెప్పగానే తాయారు కాసేపు ఊపిరి పీల్చుకుంటుంది.. మాధవ్ మనిషా ఇద్దరు ఒక్కటైతే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..