Podarillu Today Episode august 20 th:శైలు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంట్లోని వాళ్ళందరూ బాధపడిపోతూ మళ్లీ ఇంటికి చేరుకుంటారు. అటు గాయత్రి మాధవ్ నీ వెతుక్కుంటూ వస్తుంది. మాధవ్ ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే గాయత్రి ఎక్కడికి వెళ్లారు. మీరు పొద్దననుంచి కనిపించలేదు కదా ఎక్కడికి వెళ్లారు అని మాధవ్ మళ్ళీ అడుగుతాడు.. పెళ్లి కూతుర్ని వెతకడానికి ఊర్లోకి వెళ్ళాను బావ అందుకే లేట్ అయింది అని గాయత్రి అంటుంది. నాకు పెళ్లి కూతుర్ని వెతకడానికి వెళ్ళావా మరి దొరికిందా అని మాధవ్ అంటాడు. దొరికింది బావ ఎవరో కాదు మనిషా అని చెప్పగానే మాధవ్ మనిషా తో నా పెళ్లి ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ గాయత్రి అని అంటాడు. తాయారు గాయత్రి ఇక్కడ ఏం చేస్తున్నావ్ మీ ఆయన నీకోసం వెతుకుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు ఇట్టే తిరుగుతూ ఉంటావా అని అంటుంది..
శైలు మాటతో వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు.. ఏంటమ్మా నువ్వు చేసిన పని నాకు అస్సలు అర్థం కావడం లేదు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఊహించలేదు అని శంకరయ్య కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా పెంపకంలో ఏదైనా లోపం ఉందా అమ్మ పెళ్లికి ముందే నువ్వు ఎందుకు తల్లయ్యావు అని శైలు తో శంకరయ్య మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు ఏ తప్పు చేయలేదు నాన్న భూతద్దంలో పెట్టుకొని వెతికినా కూడా మీరు తప్పు చేశారని ఎవరు నమ్మరు అని శైలు చెప్తున్న సరే శంకర ఏమాత్రం నువ్వు ఎందుకు తప్పు చేసావ్ అమ్మ అని ఎమోషనల్ అయిపోతాడు. మీరు నన్ను ఇబ్బంది పెట్టెలా మాట్లాడుతున్నారు నాన్న అలా మాట్లాడకండి అని ఎంత చెప్తున్నా సరే శంకరయ్య మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఇంకెలా మాట్లాడుతాడు కన్నతల్లి కన్న ఎక్కువగా నేను చూసుకుని పెంచాడు. కన్న కూతురే కడుపు తెచ్చుకుంది అని ఆయన బాధని గుండెల్లో దాచుకోలేక ఏడుస్తున్నాడు చూడు అని వరాలు అంటుంది. నువ్వు నిజంగానే తల్లి పోయావా లేదా చెప్పు అని ఎంత చెప్తున్నారు సురేష్ శైలు మాత్రం నేను నిజంగానే తల్లిని అయ్యాను అని అంటుంది. కానీ వరాలు నిజంగానే చెప్పవే మా పరువు తీయకే మా ప్రాణాలు పోతాయి అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. వరాలు ఎంతగా అడిగినా సరే శైలు మాత్రం నేను తల్లిని అని చెప్తుంది.
ఇక సురేషు కేశవ కి ఫోన్ చేసి నా చెల్లిని తల్లి చేస్తావా? నీకు ఎంత ధైర్యం రా నువ్వు ఎక్కడున్నావో ఇక్కడికి రా రా నా ఇంటికి నిన్ను నరికేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు.. నేను తల్లిని చేయడమేంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా నీ కేశవ అంటాడు కానీ సురేష్ మాత్రం నీ అంత చూస్తాను నువ్వు ఇంటికి రారా అని వార్నింగ్ ఇస్తాడు.. ఇక వరాలు మాధవ్ కి ఫోన్ చేసి నేను అమ్మమ్మని కాబోతున్నాను నువ్వు పెద్ద నాన్నవి కాబోతున్నావు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నా కూతురిని నమ్మించి మోసం చేసి తల్లిని చేశాడు. ఇప్పుడు మా పరువు ఏం కావాలి మా ప్రాణాలు ఏం కావాలి అని వరాలు అడుగుతుంది.. అయితే మాధవ్ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. కేశవ అన్నయ్య అంటూ రావడంతో చంపలు వాయించి నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు. కానీ కేశవ మాత్రం అసలు ఆలోచించకుండా అన్నయ్య ఎందుకు నన్ను కొట్టాడు నేను చెప్పేది వినడానికి బాధపడిపోతాడు.
అరే నువ్వు మంచి పని చేశావు రా నన్ను పెదరాన్నను చేసావు అంటూ.. చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అదేవిధంగా కన్నా కూడా నన్ను బాబాయిని చేసావ్ అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్ అని అంటాడు.. మా ఇద్దరి మధ్య ఏమి జరగకుండానే ఇదంతా జరిగిపోయింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. కానీ కేశవ అసలేం జరిగిందో కనుక్కోవాలి అని శైలుకు ఫోన్ చేస్తాడు కానీ శైలు కూడా అదే చెప్పడంతో ఏంటే ఏం జరగకుండా ఇలా జరిగిందే అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు నిజంగానే నేను తండ్రిని కాబోతున్నానా ఏంటి నువ్వు ఏం చెప్తున్నావ్ నాకు అర్థం కావడం లేదు అని కేశవ అయోమయంలో ఉంటాడు.
నారాయణ ఒక తోటలో కూర్చొని తన ఫ్రెండ్స్ తో కలిసి పేకాట ఆడుతూ ఉండగా అక్కడికి వచ్చిన దుర్గ నారాయణతో గొడవకు దిగుతాడు. ఇక తను తన మనుషులతో నారాయణను కొట్టిస్తాడు. ఆ తర్వాత ఎలాగైనా సరే నారాయణతో గొడవపడి తనని చంపేయాలని అనుకుంటాడు చివరికి నారాయణ వాళ్ళతో కొట్లాడి గెలిచిన సరే.. దుర్గ మాత్రం దొంగ దెబ్బ తీసి నారాయణ కొడతాడు. అది చూసిన చక్రి ఫ్రెండ్ సతీష్ వెళ్లి వాళ్లకి చెప్తాడు వాళ్లంతా కూడా నారాయణ ఎక్కడికి వెళ్ళాడు ఎవరు తీసుకెళ్లారు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..