Telugu Serials : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీరియల్స్ అదిరిపోయే స్టోరీ తో ఔరా అనిపిస్తే మరికొన్ని సీరియల్స్ మాత్రం ఇలా ఎలా చేస్తారు అన్నట్లుగా షాక్ అయ్యేలా చేస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో సోషల్ మీడియాలో వాటికి వస్తున్న కామెంట్లను చూస్తే అర్థమవుతుంది. తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్న ప్రతి సీరియల్ కూడా ప్రతివారం మంచి రేటింగ్ ను నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సీరియల్స్ పోటీలో ఉండడం విశేషం.. ఒక సీరియల్ గురించి మరొక సీరియల్ జనాలని ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే గతవారం సీరియల్స్లలో ఏ సీరియల్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ప్రతివారం సినిమాలకి ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటాయో.. అదేవిధంగా సీరియల్స్ కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మిగతా చానల్స్ సీరియల్స్ తో పోటీ పడుతున్నాయి. కొత్తగా వచ్చిన సీరియల్స్ సైతం మంచి రేటింగ్ నీ నమోదు చేసుకుంటూ జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్ సీరియల్ గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఈ సీరియల్ రెండో స్థానంలో ఉంది.. మొదటి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ ఉండగా ఇది రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతుంది. మొత్తానికి ఇవి కూడా టాక్ ఆఫ్ ది సీరియల్ గా గుండె నిండా గుడి గంటలు రావడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..
ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రోహిణి బాగోతం బయటపడడంతో తనని ప్రభావతి అస్సలు క్షమించకుండా ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది. రోహిణి మాత్రం పరువు కోసమేనా నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వెళ్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనోజ్ తన భార్య తనని మోసం చేసింది అంటూ బాధ పడిపోతూ ఉంటాడు. బాల్ కెళ్ళి ముందు కొట్టి అక్కడ నానా రచ్చ చేస్తాడు.. కాఫీ కానిస్టేబుల్ అరుణ్ కి దొరికిపోతాడు. ఆ తర్వాత అరుణ్ తనను పోలీస్స్టేషన్ తీసుకెళ్ళమని అక్కడున్న కానిస్టేబుల్ తో చెప్తాడు. అందరూ కలిసి మనోజ్ ని నిండా ముంచేశారు అని ప్రభావతి బాధ పడిపోతూ ఉంటుంది. ఇకముందు షీలా డార్లింగ్ అడుగుపెట్టడంతో మళ్లీ మనోజ్ రోహిణి కలిసిపోతారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా ఇకమీదట ఎపిసోడ్లు కాస్త ఆసక్తికరంగా ఉంటాయని అర్థమవుతుంది..