Illu illaalu Pillalu Srivalli : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమక్క లేని పేరు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. అనాధగా పుట్టిన ఓ వ్యక్తి తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో ఆశలతో పట్టణానికి వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరి ఆ ఇంటి ఓనర్ కూతుర్నే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అప్పటినుంచి ఈ సీరియల్ పూర్తిగా మారిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఐదుగురు పిల్లలకు తండ్రి అవుతాడు. అయినా కూడా తన అత్తింటి వాళ్ళు తనని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అలాంటి క్యారెక్టర్ లో రామరాజు నటించారు. ఆయన తర్వాత తరంలో ఆ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన శ్రీవల్లి ఇంటి పెత్తనాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది.. కానీ చివరకు తాను చేసిన మోసాలు అన్ని బయటపడడంతో ఇంట్లోని వల్ల ఎవరూ కూడా తన మాట వినడానికి ఇష్టపడరు. అలాంటి గడుసు శ్రీవల్లి క్యారెక్టర్ లో నటిస్తున్న త్రివేణి యాదవ్ ఇకమీదట ఈ సీరియల్ లో కనిపించబోదు అంటూ మరో వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. గతంలో ఇలాగే అనేకసార్లు వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు పై ఎలాంటి క్లారిటీ ఉందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి క్యారెక్టర్ హైలెట్ అనే చెప్పాలి.. మంచి మర్యాదలు తెలిసిన మిగతా ఇద్దరు కోడలు కూడా తమ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ శ్రీవల్లి మాత్రం ఆ ఇంట్లో తనదే పై చేయి ఇలా ఉండాలి అని చేసిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అలా ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా రివర్స్ అవడంతో శ్రీవల్లి చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ తన భర్త దూరం పోవడానికి కారణం తన ఇద్దరు తోడు కోడళ్ళని వాళ్ల కాపురాన్ని కూడా కూల్ చేయాలి అని కంకణం కట్టుకుంటుంది. కామెడీ విలన్ గా ఈ పాత్రలో నటిస్తున్న త్రివేణి యాదవ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల ఈమె సీరియల్ నుంచి తప్పకుండా వినిపించాయి. ఇప్పుడు మరోసారి ఈమె గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సీరియల్ వల్ల ఏమిటి నెగెటివిటీ పెరగడంతో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కోడలు శ్రీవల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన త్రివేణి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. తన నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సీరియస్ తో పాటుగా సినిమాలు కూడా చేసింది. గతంలో ఈమె చేసిన సినిమాలు వస్తే.. సప్తగిరి ఎల్ఎల్బీ, మిడిల్ క్లాస్ మెలోడీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వరుసగా సీరియస్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం మేమే స్టార్ మా తో పాటుగా జీ తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో కొత్త సీరియల్ తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉందని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..