E-Paper
Advertisement

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
Advertisement

Pharma Company Blast: తెలుగు రాష్ట్రాల్లోని  ఫార్మా కంపెనీల్లో పేలుళ్లు కంటిన్యూ అవుతున్నాయి. కనీసం మూడు నెలలకు ఒక ఘటన జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వెంటనే వాటిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది?

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

Advertisement

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పోచంపల్లి మండలం దొంతిగూడెం గ్రామంలో ఉన్న హజే ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కంపెనీలోని రియాక్టర్ పేలిపోయింది. దీంతో పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలో మంటలు పరిశ్రమ అంతటా వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకున్నారు పలువురు కార్మికులు.

 

హజే ఫార్మా కంపెనీలోని రియాక్ట్ పేలుడు, పలువురు కార్మికులు మృతి

Advertisement

వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్, నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

అసలు ఘటన ఎలా జరిగింది?

రాత్రి వేళ షిఫ్టులో ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు. రియాక్టర్‌లో సాల్వెంట్ నింపే ప్రక్రియలో ఒత్తిడి అమాంతంగా పెరగడంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 20 కార్మికులు ఉంటారని చెబుతున్నారు.

రియాక్టర్ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఎట్టకేలకు ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పరిశ్రమలో గడిచిన మూడు నెలల్లో ఇది రెండో ప్రమాదం. అయినా కార్మికుల భద్రతను కంపెనీ యాజమాన్యం గాలికి వదిలేసిందని అంటున్నారు కార్మికులు.

ALSO READ: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్

ఫార్మా కంపెనీలో ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పలువురు కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

Big Stories

Advertisement
×