Anantapur Joint Family: ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సామెతను మాటల్లో వినడమే కానీ, నిజ జీవితంలో చూడటం ఈ రోజుల్లో చాలా అరుదు. చిన్న కుటుంబాలు, వేరు కాపురాలు ఎక్కువైపోయిన ఈ కాలంలో.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంత రాయుడు, ముత్యాలప్పల కుటుంబం అందరికీ ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలుస్తోంది. తరాలు మారినా, కాలం వేగంగా పరిగెడుతున్నా ఈ జంబో జాయింట్ ఫ్యామిలీ బంధాల విలువను చాటిచెబుతోంది. ఏకంగా ఆరు తరాలుగా ఏకతాటిపై నడుస్తూ, ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటూ ఆప్యాయతలను పంచుకుంటున్న ఈ పెద్ద కుటుంబం, నేటి సమాజానికి ఐక్యతలోని అసలైన తీపిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.