BIG TV Immersive Technology: తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఆదరాభిమానాలు సంపాదించిన బిగ్ టీవీ న్యూస్ ఛానల్.. రీలాంచ్ రూపంలో తిరిగి ప్రజల ముందుకు వచ్చింది. అయితే మీడియాలో ఇన్నాళ్లు ప్రజలు చూస్తూ వస్తున్న వార్తా కథనాలకు భిన్నంగా ఇకపై బిగ్ టీవీలో కొత్త పద్దతిలో ప్రసారాలు ఉండబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘ఇమ్మర్సివ్ టెక్నాలజీ’ (Immersive Technology). ఈ సాంకేతికతతో సమాచారాన్ని ఇచ్చే పద్దతి, ప్రజలు చూసే విధానం బిగ్ టీవీలో పూర్తిగా మారిపోనుంది. అయితే తెలుగు రాష్ట్రాలే గాక ఆసియాలోనే మెుట్టమెుదటి సారిగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న న్యూస్ ఛానెల్ బిగ్ టీవీనే కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోల్లో ఒకటిగా బిగ్ టీవీ నిలిచింది.