E-Paper
Advertisement

Attack on student: అల్లరి చేస్తోందని.. విద్యార్థిని పుర్రె పగిలేలా కొట్టిన టీచర్

Attack on student: అల్లరి చేస్తోందని.. విద్యార్థిని పుర్రె పగిలేలా కొట్టిన టీచర్

Teacher Attacked: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని అల్లరి చేస్తుందని బ్యాగ్ తో తల పై కొట్టిన ఉపాధ్యాయుడు. తల పగిలిందని నిర్ధారించిన వైద్యులు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాత్విక నాగశ్రీ (11) పొంగనూరు కు చెందిన భాష్యం పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తుందని హిందీ ఉపాధ్యాయుడు బ్యాగ్ తో తలపై కొట్టాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న సాత్విక నాగశ్రీ తల్లి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

తరువాత రోజు నుంచి తల నొప్పి అని విద్యార్థి ఏడుస్తూ పాఠశాలకు వెళ్లలేదు. పొంగనూరులో ఉన్న స్థానిక ఆసుపత్రి కి తీసుకొని వెళ్లారు. పరిశీలించిన వైద్యులు బాలికను బెంగళూరు తీసుకు వెళ్లాలని సూచించారు. స్కానింగ్ తీయగా పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీనితో తల్లి పాఠశాల యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందీ ఉపాధ్యాయుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు స్కూల్ యాజమాన్యం అందిచేందుకు ముందుకు వచ్చినప్పటికి కేసు విచారణ కొనసాగుతుందని డిఎస్‌పి ప్రభాకర్ తెలిపారు. హిందీ టీచర్‌ను విధుల నుండి  తొలగించినట్లు చెప్పారు.

Tags

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×