Bus Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తుంది ఓ ఆర్టీసీ బస్సు. పుంగనూరు , గూడూరుపల్లి మధ్య మలుపులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో రెండు ఆర్టీసీ బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పటిల్ కి తరలించి.. ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.