వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సోమవారం మీడియా ముందుకొచ్చిన జోగి రమేశ్, ఫ్యామిలీలో అలాంటి గొడవలు సహజమేనని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా జోగి చేసిన వ్యాఖ్యలపై ఆయన కోడలు మేఘన కౌంటరించారు. ‘బిగ్ టీవీ’తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.