KBR Park Traffic: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు హెచ్ సిటీ ప్రాజెక్టు అనే విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా నేడు హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. దీనిలో భాగంగా నేడు KBR పార్క్ పరిసర ప్రాంతం చుట్టూ వన్ వే రోడ్డును ట్రాఫిక్ పోలీసులు నేటి నుండి మోదలు పెట్టారు.
హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏడు ప్రధాన జంక్షన్లలో ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణంను చేపడుతున్నారు. దీంతో రోడ్డు వెడల్పు తగ్గడంతో ప్రస్థుతం అందుభాటులో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో నేడు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో అటు పోలీసులు, వాహణాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోజు ప్రయాణించే దారుల్లో కాకుండా కొత్త ప్రదేశాలనుండి వాహనాలను పోలీసులు మల్లిస్తున్నారు. దీంతో కొంత మంది ప్రుయాణికులకు అర్థం కాక ట్రాఫిక్ తో నరకయాతన పడ్డారు.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఫిల్మ్ నగర్ జంక్షన్, రోడ్ నంబర్ 45, మహారాజా అగ్రసేన్ ఐలాండ్తో సహా ఏడు కీలక పాయింట్ల వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్ళిస్తున్నారు. దీంతో కాస్త గందరగోళం ఎర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనదారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మార్పులు కొన్ని రోజువరకే అని రానున్న రెండు మూడు రోజుల్లో వాహనదారులకు అలవాటైపోతుందని పోలీసులు తెలిపారు.
Also Read: టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం