Revanth Reddy: కేంద్ర- రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్పూర్తి కొనసాగుతోందా? లేదంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరస్పర గౌరవం ఉండాలన్న రాజ్యాంగ విధానాలకు విఘాతం కలుగుతోందా? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చజరుగుతోంది.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రయినా విదేశాల్లో పర్యటించాలనుకుంటే కేంద్రానికి సమాచారం ఇస్తారు. విదేశాంగ,ఆర్ధిక శాఖ క్లియిరెన్స్ ఇస్తాయి. ఇది రోటిన్ ప్రాసెస్. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్,అమెరికా పర్యటనకు సంబంధించి తెలంగాణ సీఎంవో కేంద్రానికి లేఖ రాసింది. ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న వాళ్లు సరిగ్గా అప్లికేషన్ కూడా ఫిల్ చేయలేకపోతున్నారు. చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగాలకు పొంతన ఉండడంలేదు. అందుకు కారణం మారుతున్న కాలానికి తగ్గట్టుగా అకాడమిక్ సిస్టమ్ లేకపోవడమే. అందుకే యువతలో స్కిల్ డెవలప్మెంట్ సహా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో మార్పు తేవాలని అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.