గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మున్సిపాలిటీల డీలిమిటేషన్ అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది.
డీలిమిటేషన్ను “ఓ పార్టీ మెప్పు కోసం” చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి బీజేపీ కార్పొరేటర్లు సభలోని గెజిటెడ్ పేపర్లను చింపి విసిరేశారు.
సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ.. సభ్యుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని నివేదికను ప్రభుత్వానికి పంపాలని కమిషనర్ను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. అనంతరం సభను వాయిదా వేయడంతో..కౌన్సిల్ బయట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.