Hyderabad Crime: హైదరాబాద్ బాపూజీనగర్లో పవిత్రను దారుణంగా చంపిన ఉమాశంకర్ను చంపేయాలంటున్నారు మృతురాలి బంధువులు. పవిత్ర తల్లి లక్ష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉమాశంకర్ ఇంటికొచ్చేటప్పుడు కత్తి తీసుకొనే వచ్చాడని.. ఇలా చేస్తాడని ఊహించలేదని కన్నీంటి పర్యంతం అయ్యింది మృతురాలి తల్లి. పవిత్రను అనుమానంతోనే చంపేశాడంటున్నారు స్థానికులు. ఇలాంటి వ్యక్తిని ఇంటికి రానివ్వడమే పెద్ద తప్పుంటున్నారు. ఉమాశంకర్ని కూడా పవిత్రని చంపేసినట్టు చంపితేనే న్యాయం జరుగుతుందంటున్నారు మృతురాలి బంధువులు.