Karimnagar: కరీంనగర్ జిల్లా వివిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు , కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. అనంతరం ఘటనాస్థలి నుండి పరారయ్యాడు. తల్లి పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన( 15) మృతి చెందగా… కొడుకు ఆశ్రిత్(17) పరిస్థితి విషమంగా ఉంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘూతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.