ACB Raids: తెలంగాణలో ఏసీబీ అవినీతి అధికారుల దుమ్ము దులుపుతోంది. అయితే, ఏసీబీ పట్టుకున్న ప్రతీ అధికారి అవినీతి చిట్టా.. అధికారులకే షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. 100 కోట్లకు తగ్గకుండా అవినీతి బాగోతం బయటపడుతుండడం ఇందుకు నిదర్శనం. తాజాగా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్పై ఏసీబీ దాడుల ఘటన కూడా సంచలనంగా మారింది. ఇసుక దందాలు చేసే వారి నుంచి భారీగా ముడుపులు తీసుకుని వాటిని డ్రైవర్, కుమార్తె అకౌంట్లకు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
Also Read: చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!
కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ సహా 8 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో దాదాపు 65 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. బిల్డింగ్స్, ఫ్లాట్లు, ఇంటి స్థలాలు, భూములతో పాటు నగదు, బంగారం, బ్యాంకు డిపాజిట్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అసలు జయరాజ్ బినామీ సామ్రాజ్యం విలువ ఎంత? ఇలాంటి అవినీతి అనకొండలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ఉన్నాయి? ఏసీబీ పనిలోపనిగా వారందరి భరతం పడుతుందా? అసలు ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?