BRS Sitting MLAs: తెలంగాణలో గులాబీ పార్టీకి సిట్టింగ్ ఫీవర్ పట్టుకుంది! అవును నిజమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్గా చేసుకున్న BRS ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2023 ఓటమికి సిట్టింగుల పనితీరు, ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు వంటి అంశాలే ఎక్కువ కారణమని భావిస్తోంది పార్టీ అధిష్టానం. ఇంటెలిజెన్స్, ప్రైవేట్ సర్వేలతో నియోజకవర్గాల వారీగా లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. గెలుపు అవకాశాలున్న కొత్త ముఖాలతో పాటు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన నేతలపైనా ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, రిజర్వేషన్ల మార్పులను బట్టి టికెట్ల కసరత్తులో మార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి గులాబీ పార్టీ వ్యూహం ఈసారైనా గట్టెక్కిస్తుందా? మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందా?