Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి తండాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పక్కింటి వారు తనను వేధిస్తున్నారని ధరంసోత్ రవికుమార్ సెల్ టవర్ ఎక్కారు. తన ఇంటికి దారి లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పెద్దలు కూడా తనకు నరకం చూపిస్తున్నారని.. ఇంటి చుట్టూ కంచ వేసి దారి లేకుండా చేశారని అన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కారు. పెద్ద మనుషుల చుట్టూ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గూడురు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని.. చర్యలు చేపడుతున్నారు.