E-Paper
Advertisement

Bus Accident: ట్యాంకర్ ఢీ కొన్న జగన్ బస్సు.. నిద్రలో 40 మంది..

Bus Accident: ట్యాంకర్ ఢీ కొన్న జగన్ బస్సు.. నిద్రలో 40 మంది..
Advertisement

Bus Accident:  మహబూబ్‌నగర్ జిల్లాలోని మాచారం సమీపంలో NH 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం ధాటికి ట్యాంకర్ లీకై అందులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుండి దట్టమైన పొగలు వెలువడటంతో హైవేపై కొంత పైపు భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×