Mahesh Kumar Goud: బీజేపీ మహాదర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ఏమీ చేయని కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుతో తమకు బాధ్యతలు అప్పగించబడిందని గౌడ్ తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్లూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మెప్పు పొందుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ దక్కకపోవడం దీనికి స్పష్టమైన సాక్ష్యమని ఆయన జోరుగా గుర్తుచేశారు. అంతేకాక మూడేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే కట్టుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత చేశారు.