మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. గోదావరి నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్లు కనిపించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, వేదమంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టగా.. భూమిలో నుంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ఆ విగ్రహానికి పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ విషయం తెలియడంతో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.