Road Accident: రంగారెడ్డి జిల్లా కనకమామిడి వద్ద హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడని వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కర్ అనే మరొక వ్యక్తి మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.