Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. తన కొడుకుని పథకం ప్రకారమే గదికి పిలిచి ఎనిమిది మంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సీనియర్స్ రాత్రి 11 గంటల నుంచి మూడు గంటల వరకు చిత్రహింసలు పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 8 మందిని ఉరితీయాల్సిందేనని సృజన్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.