కొండా సురేఖతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారంపైనా పీసీసీ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో.. అటవీ శాఖలో ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. శాఖలో అధికారుల కొరత ఉందంటూ PCCF చేసిన అభ్యర్థన నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగిందంటున్నారు.
అటు సురేఖ మాజీ ఓఎస్డీ పై FIR నమోదు విషయంలో ఆలస్యంపై జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. సో టైమింగ్ మాత్రం పొలిటికల్ గా ప్రశ్నల్ని సంధిస్తోంది. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్.. డిప్యుటేషన్ల రద్దు.. ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్ వరుస పరిణామాలేనా? లేక కొండా సురేఖపై ఒత్తిడి పెంచే సంకేతాలా? హైకమాండ్ చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చిన్నారెడ్డిపై చర్య ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అందరి చూపూ కాంగ్రెస్ అధిష్ఠానం వైపే.