రాజమండ్రిలో సాధిక్ ఖాన్ ఇష్యూ ఇప్పుడు గరంగరంగా మారింది. సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తోంది. బలవంతంగా మతం మార్చి నిఖా చేసుకోవాలని యత్నించాడన్న కోణంలో కేసు నమోదైంది. ఆమె భర్త జగదీశ్రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ పాత్ర ఉందన్న ఆరోపణలతో హత్య కేసు కూడా పెట్టారు. ప్రోటీన్ పౌడర్ లో సైనైడ్ కలిపి చంపాడన్న ప్రచారం జరుగుతోంది.
లవ్ జిహాద్ ఇష్యూ ఇప్పుడు రాజమండ్రిలో బిగ్ డిబేట్ గా మారాయి. సాధిక్ బాధితులు చాలా మందే ఉంటారన్న వాదన పెరుగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి.. వైసీపీ హయాంలోనే లవ్ జిహాద్ మొదలైందంటూ ఆరోపించారు. బాధితురాలు కూడా తనను బలవంతంగా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని సూసైడ్ నోట్ రాసింది. సాదిక్ వెనుక ఎవరున్నారు? అతడు చేసిన అరాచకాలేంటి… ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారు.. ఇవన్నీ ఇప్పుడు పోలీసులు తేల్చాలి.