Visakhapatnam Beach: విశాఖ బీచ్లో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు గల్లంతయ్యారు. వుడా పార్కు లైట్ హౌస్ సమీపంలో ఎనిమిది మంది స్నేహితులు బీచ్కు వచ్చారు. వీరిలో నలుగురు స్నానానికి సముద్రంలోకి దిగారు. రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ అనే ఇద్దరు విద్యార్ధులు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. తేజస్ మృతదేహం లభ్యం అయ్యింది. మరొకరు కోసం పోలీసులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.