Chittoor: ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు యత్నించారు.. భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు వెంకటేష్. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. ఆర్మీలో డ్యూటీ చేస్తున్న వేంకటేశులు భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వేంకటేశులుకు ఈ విషయం తెలియడంతో చంపాలని నిర్ణయించుకుంది భార్య శిల్ప. అనంతరం ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.