E-Paper
Advertisement

Viral Video: అది ట్రైన్ ఆ లేక ఫుట్ పాత్ ఆ.. ఇంత దారుణంగా ఉందేంటి..

Viral Video: అది ట్రైన్ ఆ లేక ఫుట్ పాత్ ఆ.. ఇంత దారుణంగా ఉందేంటి..

Viral Video: ఇటీవల రైలులో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రైలులో ప్రయాణించాలంటే భయం పుట్టేలా ఉంటుంది పరిస్థితి. కనీసం నిలుచునేందుకు కూడా స్థలం లేకుండా, ఏసీ బోగీల్లోను నిల్చుని ప్రయాణిస్తున్న వీడియోలు ఇటీవల పదుల సంఖ్యలో వీడియోలో నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాడ కూడా రైల్వే అధికారులు తీసుకునే చర్యల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండడం లేదు.

తాజాగా ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులు దారుణంగా ప్రయాణించారు. ఏకంగా టాయిలెట్ ఏరియా దగ్గర నిద్రిస్తూ.. కనీసం ఒక అడుగు వేయాలన్నా కూడా స్థలం లేని ఇరుకు ప్రదేశంలో పడుకుని, కూర్చుని, నిలబడి ప్రయాణించారు. మరికొందరు స్థలం దొరక్క ఇబ్బందులు పడ్డారు.
ఓవైపు టాయిలెట్ కంపు, మరోవైపు అక్కడే ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసిన వాష్ బేషన్ కూడా ఉంది. డోర్ పక్కన పడుకుని మరి, మహిళలు, పురుషులు, చిన్న పిల్లలతో సహా చాలా దారుణంగా ప్రయాణించారు.

ఇదంతా ఏసీ కోచ్‌లలో వెలుగు చూడడం ఆశ్చర్యానికి గురిచేసింది. రైలులోని ఏసీ కోచ్‌లలో కూడా ప్రయాణికులు మరీ ఇంత ఇరుకుగా ప్రయాణిస్తున్నారా అని నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో దేని పరిస్థితి మారినా కూడా రైల్వే పరిస్థితి మాత్రం అస్సలు మారట్లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిపై రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×