E-Paper
Advertisement

Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!

Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!
Advertisement

HP Petrol Pump Fraud:

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయించుకోవాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి దాపురించింది. ఎక్కడ ఎలాంటి పెట్రోల్ అమ్ముతున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పెట్రోల్ తక్కువగా వస్తే వచ్చింది, పెట్రోల్ అయితే చాలు అనే దుస్థితికి వచ్చారు. తాజాగా ఓ వ్యక్తి కారులో పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వెళ్లాడు. ఉదయం ఆఫీస్ కు వెళ్లడానికి కారు స్టార్ట్ చేస్తే కాలేదు. వెంటనే మెకానిక్ ను పిలిచి చెక్ చేయిస్తే, ఇంజిన్ లో వాటర్ ఉన్నట్లు తేలింది. ఒక్కసారిగా షాకైన కారు యజమాని నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి చెక్ చేయగా అసలు కథ బయటపడింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హైదరాబాద్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి (సెప్టెంబర్ 11) పూట తన బ్రెజా కారులో రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని HP బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు. ఉదయం సమయంలో ఆఫీస్ కు వెళ్లేందుకు కారు తీయబోయాడు. ఎంతకీ కారు స్టార్ట్ కాలేదు. వెంటనే మెకానిక్ ను పిలిచాడు. అతడు కారును పరిశీలించి ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లాయని చెప్పాడు. ఇంజిన్ డ్యామేజ్ అయినట్లు చెప్పాడు. ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. వెంటనే ఆయనకు అనుమానం కలిగింది. రాత్రి పెట్రోల్ కొట్టించుకు శేరిగూడ HP బంకుకు వెళ్లాడు. బాటిల్ లో పెట్రోల్ కొట్టమన్నాడు. కొట్టగానే బంకు కథ బయటపడింది. బాటిల్ లో బురద నీళ్ల లాంటి పెట్రోల్ వచ్చింది కాసేపు అలాగే ఉంచితే కిందికి నీళ్లు, పైవైపు పెట్రోల్ తేలింది. బంకు సిబ్బందితో మహేష్ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కారుకు జరిగిన డ్యామేజ్ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అటు అధికారులకు ఫిర్యాదు చేశాడు. పైగా అది ఒరిజిన్ పెట్రోల్ అంటూ బంకు సిబ్బంది వాగ్వాదానికి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చేసిందే తప్పు, పైగా దబాయింపు ఏంటని వాహదారులు పైకి లేవడంతో సిబ్బంది వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Read Also:  చీర కొంగుతో నక్కను చంపేసిన మహిళ.. అరగంట పోరాడి..

గతంలోనూ ఇలాంటి ఆరోపణలు

Advertisement

అటు శేరిగూడ HP పంపు మీద గతంలోనూ పలుమార్లు కల్తీ ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కొంత మంది వాహనదారులు కంప్లైంట్ చేసినట్లు స్థానికులు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన జరగడం చూస్తుంటూ, యాజమాన్యం తీరు మారినట్లు కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తూనికలు, కొలతల అధికారులు ఈ బంక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకుంటేనే మిగతావారు భయపడే అవకాశం ఉందంటున్నారు.

Read Also: కారును తప్పించబోయిన రోడ్డు దాటి దూసుకెళ్లిన బస్సు, తృటిలో తప్పిన పెను ముప్పు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×