BigTV English
Advertisement

Watch Video: కరెంటు సరిగా రావట్లేని యువకుల ఆగ్రహం, ఏకంగా సబ్ స్టేషన్ కు నిప్పు!

Watch Video: కరెంటు సరిగా రావట్లేని యువకుల ఆగ్రహం, ఏకంగా సబ్ స్టేషన్ కు నిప్పు!

విద్యుత్ అధికారుల వ్యవహారం ఇద్దరు యువకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సరిగా కరెంటు సరఫరా చేయకపోవడంతో పాటు ఎప్పుడు వస్తుందో చెప్పాలని అధికారులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. ఓ క్యాన్ లో పెట్రోల్ నింపుకుని నేరుగా సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. సబ్ స్టేషన్ మీద వెంటతెచ్చుకున్న పెట్రోల్ చల్లి నిప్పు అంటించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వాల్గావ్ లో జరిగింది. సబ్ స్టేషన్ తో పాటు బ్యూటీలో ఇంజినీర్ పైగా పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువకులను అరెస్ట్ చేశారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ ఘటనకు సంబంధించి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గంటల తరబడి కరెంటు లేకపోవడం వల్ల ఆగ్రహంతో యువకులు రెచ్చిపోయినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి రేవాసా గ్రామానికి విద్యుత్  సరఫరా నిలిచిపోయింది. జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను సంప్రదించడానికి పదే పదే చేసిన ప్రయత్నం చేసినా సదరు యువకులకు సరైన సమాధానం రాలేదు. పైగా వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం, రోజుల తరబడి కరెంటు లేకపోవడంతో గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాల్గావ్ విద్యుత్ సబ్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.


సబ్‌స్టేషన్‌కు నిప్పంటించిన యువకులు

ఈ ర్యాలీ నేరుగా సబ్ స్టేషన్ దగ్గరికి రాగానే అక్కడ విధుల్లో ఉన్న ఇంజనీర్‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేయడం మొదలుపెట్టాడు. అతడి తీరుపై  కోపంతో ఊగిపోయిన యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇంజనీర్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గ్రామస్తులు ఆఫీసు ఫర్నిచర్‌పై పెట్రోల్ చల్లి  నిప్పంటించారు. అటు సబ్ స్టేషన్ యంత్రాల మీద కూడా పెట్రోల్ చల్లి తగలబెట్టారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా కార్యకలాపాలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.

Read Also: భయపెడుతోన్న జులై 5.. టికెట్లు క్యాన్సల్ చేసుకుంటోన్న జనం!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

అటు సబ్ స్టేషన్ తగలబెట్టడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యువకులు సబ్‌స్టేషన్ టేబుల్‌కు నిప్పంటిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. సదరు యువకులతో పాటు పలువురు గ్రామస్తులపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వాల్గావ్ పోలీసులు వెల్లడించారు. ఇందులో పాల్గొన్న వారందరినీ గుర్తించడానికి, నష్టాన్ని రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గ్రామస్తులు హింసాయుత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్తును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Read Also: ఇదేం చిత్రం.. మనిషి లేకుండా బైక్ దానంతట అదే పరుగు, వీడియో వైరల్!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×