BigTV English

Reporter Viral Video: పీకల్లోతు వరద నీటిలోకి దిగి రిపోర్టర్ లైవ్.. కళ్లముందే దారుణం.. వీడియో వైరల్

Reporter Viral Video: పీకల్లోతు వరద నీటిలోకి దిగి రిపోర్టర్ లైవ్.. కళ్లముందే దారుణం.. వీడియో వైరల్
Advertisement

Reporter Viral Video: అతను రిపోర్టింగ్ కోసం వెళ్లాడు. భారీ వరద ప్రవాహం ఉప్పొంగుతోంది. అయితేనేమి కాస్త తొందరపడ్డాడు. ఏకంగా నీటి వాగులోకి వెళ్లాడు. కెమెరామెన్ స్టార్ట్ అన్నాడు.. ఇక అక్కడి పరిస్థితి వివరించేందుకు అతను అడుగులు వేశాడు. ఇంకేముంది.. ఆ రిపోర్టర్ కొట్టుకుపోయాడు. అసలేం జరిగిందంటే?


పాకిస్తాన్‌ను ప్రస్తుతం మళ్లీ భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఓ టీవీ చానల్ రిపోర్టర్.. వరద నీళ్ల పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు నేరుగా లైవ్ బులెటిన్‌లోకి వెళ్లాడు. కానీ, ఆ లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు ఊహించని దృశ్యం కనిపించింది.

‘లైవ్’కి వెళ్లాడు.. కానీ బతికి తిరిగొచ్చాడా?
సామాన్యంగా రిపోర్టర్లు వరదల సమయంలో కాస్త వాగులకు దూరంగా ఉండే రిపోర్టింగ్ చేస్తుంటారు. కానీ ఈ పాకిస్తాన్ రిపోర్టర్ మాత్రం, అసలు ఘటన స్థలానికే వెళ్లి, మెడ వరకూ నీళ్లలో నిలబడి కెమెరా ముందు లైవ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా వచ్చిన నీటి ప్రవాహానికి భరించలేక గల్లంతయ్యాడు. అతని ఏడుపులు చూసి మొదట ఎవరూ పెను ప్రమాదమని ఊహించలేదు. కానీ ఒక్కసారిగా అతడు పడిపోవడం, ప్రవాహం తీసుకుపోవడం చూస్తూ.. ఆ లైవ్‌ను చూస్తున్నవారంతా షాక్‌కి గురయ్యారు.


వీడియో వైరల్.. నెటిజన్స్ హృదయాలు కలచివేసిన దృశ్యాలు
ఈ లైవ్ రిపోర్టింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది వార్తలు కాదు.. నిజమైన పోరాటం, ఓ రిపోర్టర్ ప్రాణాలకు తెగించి తన పని చేస్తుంటే ఇలా జరగడం చాలా బాధాకరం, సురక్షితంగా బయటపడ్డాడా? అంటూ వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే, ఛానెల్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇతను పని చేశాడు, కానీ మీ బాధ్యత ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అతను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడా?
తాజా సమాచారం ప్రకారం, ప్రవాహం వల్ల కొంత దూరం కొట్టుకుపోయిన ఆ రిపోర్టర్‌ను స్థానికులు, రెస్క్యూ టీమ్ కలిసి సురక్షితంగా బయటకు తీశారు. అతను గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కానీ ఆ సంఘటనలో అతనికి జరిగిన మానసిక ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. అతను లైవ్‌లో అంతవరకూ ఎంత ధైర్యంగా మాట్లాడాడో, చివర్లో ఆ బలమైన ప్రవాహానికి ఎదురయ్యేటప్పుడు చూపించిన బెదురు ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Also Read: Mobile Ceremony Vehicles: ఆ నలుగురు అవసరం లేదు.. ఇంటి వద్దనే అంత్యక్రియలు.. కొత్త ట్రెండ్ వచ్చేసింది!

ఇటీవల పాకిస్తాన్ ను వరదలు ముంచేస్తున్నాయి. 2022లో జరిగిన భారీ వరదల్లో లక్షలాది మందికి నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. వేలాది గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. మౌంటెన్ ఏరియాల్లో మట్టి విరిగిపోవడం, జలపాతం గలగలలతో జనజీవనం నిలిచిపోయింది. ఇలాంటి సమయంలో మీడియా ప్రతినిధులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు నిజం చూపిస్తున్న తరుణంలో ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.

ఈ సంఘటన తర్వాత మీడియా వర్గాల్లోనూ చర్చ మొదలైంది. వార్తలు అందించడమే కాదు.. వాళ్ల ప్రాణాలూ అమూల్యం అనే విషయాన్ని గుర్తుచేస్తోంది. రిపోర్టర్లు ఫీల్డ్‌కి వెళ్ళే ముందు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం, ఎలాంటి ప్రమాదస్థితుల్లోనైనా ప్రొటోకాల్ పాటించడం చాలా అవసరమని మీడియా పెద్దలు సూచిస్తున్నారు. లైవ్ ఉండే క్షణాల్లో ప్రతి చిన్న తప్పిదం కూడా పెనుప్రమాదానికే దారి తీస్తుందన్నది వారి అభిప్రాయం.

ఈ సంఘటన పాకిస్తాన్ వరదల ఉగ్రతను మాత్రమే కాకుండా.. పాత్రికేయుల ధైర్యాన్ని, వారి పని వెనుక ఉన్న రిస్క్‌ను ప్రపంచానికి చూపించింది. ఇది మానవతా విలువలకు గౌరవం కలిగించే సంఘటనగా నిలిచిపోతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.

Related News

దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Big Stories

×