E-Paper
Advertisement

Viral Video: బోర్డర్‌లో భారత్ – పాక్ జింకల పోరాటం.. వీడియో వైరల్

Viral Video: బోర్డర్‌లో భారత్ – పాక్ జింకల పోరాటం.. వీడియో వైరల్
Advertisement

Viral Video: తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు ఓ ఘటనలో ఏం లేకపోయినా సరే దానిని చూసే కోణాన్ని బట్టి దాని అర్థం తెలుస్తుంది. అలాగే కొన్ని వీడియోలు సాధారణంగా ఉన్నాయనుకున్నా కూడా అందులో చాలా అర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

అయితే మన దాయాది దేశమైన పాకిస్థాన్ శత్రు దేశమనే విషయం తెలిసిందే. అభివృద్ధిలో భారత్ దూసుకుపోతుండడం చూసి పాకిస్థాన్ అస్సలు ఓర్వలేదు. ఈ తరుణంలో ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటుంది. అయితే ఇలా ఎన్నో సార్లు చాలా అల్లకల్లోలం సృష్టించిన చరిత్ర కూడా పాకిస్థాన్ కు ఉంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి భారత్ లోకి దొంగచాటుగా ప్రవేశించి కాల్పులు, బాంబు దాడులు చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో భారత్, పాక్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ జింకలకు సంబంధించిన వీడియో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇరుదేశాలకు చెందిన జింకలు ఒక దానిపై ఒకటి దాడి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిహద్దులో ఉన్న ఫెన్సింగ్ పై నుంచే జింకలు తలపడడం ప్రారంభించాయి. తొలుత ఒక దానిని ఒకటి చూసుకున్న జింకలు, అవి రెండు బార్డర్లకు ఇరు వైపుల ఉన్నాయని అర్థం చేసుకున్నాయి. ఈ తరుణంలో కయ్యానికి కాలు దువ్వాయి. ఏకంగా పందెం పోటీలో కోళ్లు కొట్లాటకు దిగినట్లు ప్రవర్తించాయి. అవతల పాకిస్థాన్ జింక, ఇవతల భారత్ జింక కలిసి కుమ్ములాట ప్రారంభించాయి.

ఈ తరుణంలో జింకలు ఒకదానిపై ఒకటి కుమ్ముకోవడం ప్రారంభించాయి. దీనికి సంబంధించిన దృశ్యం ఆశ్చర్యకరంగా ఉండడంతో అక్కడే ఉన్న భారత ఆర్మీ దళంలోని ఆఫీసర్లు ఓ వీడియోను చిత్రీకరించారు. జింకలు ఫైట్ చేసుకున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×