E-Paper
Advertisement

Viral News: రోజా పూలు పాత స్టైల్.. ఏనుగు పేడ కొత్త ట్రెండ్, వాలంటైన్స్ డేకి కొత్త గిఫ్ట్ రెడీ!

Viral News: రోజా పూలు పాత స్టైల్.. ఏనుగు పేడ కొత్త ట్రెండ్, వాలంటైన్స్ డేకి కొత్త గిఫ్ట్ రెడీ!
Advertisement

ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ప్రేమలో ఉన్న వాళ్లు వాలంటైన్స్ డే వీక్ పేరుతో రకరకాల గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. హ్యాపీగా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ప్రేమను ఎదుటి వారికి వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పువ్వులు, చాక్లెట్లు, బహుమతులు ఇస్తుంటారు. ప్రేమను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మిమ్మల్ని వదిలేసి వెళ్లిన ప్రియురాలు లేదంటే ప్రియుడు ఎప్పుడైనా గుర్తుకు వచ్చాడా? ప్రేమికుల రోజున వారి మీద మీ కోపం అంతా చూపించాలని ఉందా? అయితే, వారికి ఓ చెత్త బహుమతి పంపించండి. ఇంతకీ ఆ బహుమతి ఏదై ఉంటే బాగుంటుంది? ఎలా పంపాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

10 డాలర్ల ఛార్జ్ తో ఏనుగు పేడ బహుమతి

Advertisement

అమెరికా టేనస్సీలోని మెంఫిస్ జూ సంస్థ ఎక్స్ లవర్స్ కు చెత్త బహుమతి పంపించే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇందుకోసం 10 డాలర్లు ఛార్జ్ చేస్తుంది. ముందుగా వారికి డబ్బులు పే చేసి, మీ ఎక్స్ లవర్ వివరాలను అందిస్తే, వారికి ఈ చెత్త బహుమతిని అందిస్తారు.  ఇంతకీ ఈ సంస్థ పంపించే బహుమతి ఏంటో తెలుసా? అత్యంత దుర్వాసన వెదజల్లే ఏనుగు పేడ. “మీకు చిరాకు కలిగించే పొరుగు వారు, అహంకారపూరితంగా వ్యవహరించే అత్తగారు, మీ మాజీ లవర్, పిచ్చి లేపే తోటి ఉద్యోగి, మీకు కంపరం తెప్పించే వ్యక్తికి ఈ వాలంటైన్స్ డే రోజు అత్యంత చెత్త బహుమతి అయిన దుర్వాసన కలిగి ఉన్న ఏనుగు పేడను అందివ్వండి. మీరు 10 డాలర్లు పే చేసి, ఆర్డర్ ఇస్తే, మీ కోపాన్ని కనబరిచేలా మేం చెత్తి బహుమతిని పార్శిల్ చేస్తాం” అని మెంఫిస్ జూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

 

View this post on Instagram

 

Read Also:  భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..

Advertisement

మీరు ఈ ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే?

మెంఫిస్ జూ సోషల్ మీడియా ఈ గిఫ్ట్ ఆర్డర్ ను ఎంచుకోవాలి. ఆర్డర్ కోసం నిర్ణీత ఛార్జ్ చెల్లించాలి. మీరు కోరుకున్న వారికి డిజిటల్ థాంక్యూ యు కార్డ్, దుర్వాసనతో కూడిన ఏనుగు పేడతో కూడిన బహమతిని పంపిస్తారు. డేటింగ్, డంపింగ్ ప్రచారం కేవలం ప్రచార జిమ్మిక్ కాదు. ఈ డబ్బులను మెంఫిస్ జూ తన సంరక్షణలో ఉన్న జంతువు బాగోగుల కోసం వినియోగించనున్నారు. ఈ జూ ప్రస్తుతం 3,500 కంటే ఎక్కువ జంతువులను సంరక్షిస్తున్నది. వీటి సంరక్షణ కోసం నిధులను సేకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.  ఈ ప్రయత్నాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. నచ్చని వారి పట్ల కోపాన్ని ప్రదర్శించే క్రమంలో వన్యప్రాణులను కాపాడేందుకు సాయం చేయడం గొప్పగా ఉందంటున్నారు. ఈ ఆలోచన చేసిన వారికి అభినందనలు చెప్తున్నారు.

Read Also: రైలు వాష్ రూమ్ లో నిలబడి కుంభమేళాకు వెళ్లిన యువతులు, నెట్టింట వీడియో వైరల్

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×