E-Paper
Advertisement

APMSRB Recruitment: డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట జాబ్

APMSRB Recruitment: డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట జాబ్
Advertisement

APMSRB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు, విద్యార్హత, వయస్సు, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (NMHP), టెలి మానస్‌ (Tele MANAS) సెల్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 76 పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ALSO READ: సీబీఐలో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లకు అద్భుత అవకాశం

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76

Advertisement

పోస్టులు – వెకెన్సీలు: 

1. కన్సల్టెంట్‌ సైకియార్టిస్ట్‌: 12
2. క్లినికల్ సైకాలజిస్ట్‌: 19
3. సైకియార్టిక్‌ సోషల్‌ వర్కర్‌: 06
4. కౌన్సిలర్‌: 36
5. టెక్నికల్‌ కో-ఆర్డినేటర్‌: 01
6. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, ఎంబీబీఎస్‌, డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్/పీహెచ్‌డీ, ఎంస్‌/ఎండీ, ఎంఎస్‌డబ్ల్యూ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025  జూన్ 5వ తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు క్లినికల్ సైకియార్టిస్ట్‌కు రూ.1,00,000, క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.27,500, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌కు రూ.25,000, కౌన్సిలర్‌కు రూ.18,066, టెక్నికల్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తకు ప్రారంభ తేది: 2025 జూన్ 7 (నిన్నటి నుంచే ప్రారంభమైంది)

దరఖాస్తుక చివరి తేది: 2025 జూన్ 18

దరఖాస్తు ఫీజు:  ఓసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉుంటుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: TSPSC Group 3: తెలంగాణ గ్రూప్‌ 3.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 18

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×