BigTV English

AP aerospace park: కర్ణాటకను దెబ్బ కొట్టిన ఏపీ.. లోకేష్ స్కెచ్ సక్సెస్.. ఆ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికే!

AP aerospace park: కర్ణాటకను దెబ్బ కొట్టిన ఏపీ.. లోకేష్ స్కెచ్ సక్సెస్.. ఆ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికే!

AP aerospace park: అక్కడ భూములు నిల్.. ఇక్కడ రెడీగానే ఉన్నాయి! ఇక ఇంకెందుకు ఆలస్యం? దేశంలోనే కీలకంగా మారిన ఓ ప్రముఖ రంగ సంస్థకు ఓ రాష్ట్రం గుడ్ బై చెప్పగా.. మరో రాష్ట్రం మాత్రం రెడీగా ఉంది. మీ కోసం ఎకరాల కొద్దీ భూమి, బంపర్ పాలసీలు.. అంతే కాదు, బెంగుళూరుకు కాస్త దూరంగానే ఉన్నా, లొకేషన్ మాత్రం సూపర్ అనే స్టయిల్లో ఆహ్వానం పంపింది మాత్రం ఈ రాష్ట్ర యువ మంత్రి. అక్కడి రైతులు ఒప్పుకోక వెనక్కు తగ్గిన పథకం.. ఇప్పుడు పొరుగున్న రాష్ట్రానికి మాత్రం గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. ఇంకేముంది? కంపెనీలకు రెండు చేతులూ లాగి పిలుస్తున్న ఆ రాష్ట్ర నాయకత్వం, ఇప్పుడే చర్చకు సిద్ధమంటోంది!


ఇండియా ఏరోస్పేస్ రంగంలో కీలక ఘట్టానికి చేరుకుంది. కర్ణాటక ప్రభుత్వం దేవనహళ్లిలో చేపట్టబోయే 1,777 ఎకరాల ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్ట్‌ను రైతుల నిరసనలతో వెనక్కి తీసుకున్న వెంటనే, దానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో బాహుబలి సినిమానే చూపించింది. ఏకంగా బెంగుళూరుకు సమీపంలోనే 8,000 ఎకరాల భూమిని సిద్ధం చేస్తూ, కంపెనీలకు గిఫ్ట్ లాంటి ప్రోత్సాహకాలను ప్రకటించింది.

రైతుల నిరసనలు.. కర్ణాటకలో ప్రాజెక్ట్ క్యాన్సిల్
దేవనహళ్లి తాలూకాలో ప్రవేశపెట్టిన ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమిని సాధించేందుకు గత మూడున్నరేళ్లుగా కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడి రైతులు తమ ఉల్లాస భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని 1,198 రోజులు నిరంతరంగా పోరాటం చేశారు. చివరికి సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ భూసేకరణ లేకుండా, స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రైతుల నుంచే భూములను తీసుకుంటామని స్పష్టమయ్యింది.


బై బై కర్ణాటక.. వెల్‌కమ్ టు ఆంధ్ర.. లోకేష్ ఆహ్వానం
కర్ణాటక వెనకడుగు వేసిన ఈ తరుణంలో, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం సూటిగా వ్యవహరించారు. ట్విట్టర్‌లో (X) ఓ పోస్టు ద్వారా ఏయిరోస్పేస్ రంగ సంస్థలకు బహిరంగంగా ఆహ్వానం పలికారు. Dear Aerospace industry, sorry to hear about this.. I have a better idea for you అంటూ ప్రారంభించిన ఈ ట్వీట్‌లో, ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల భూమి గురించి వివరించారు.

Also Read: Indian Railways frauds: ఒరిజినల్ టీటీఈని.. ఇలా గుర్తు పట్టండి.. లేకుంటే అంతా హాంఫట్!

బెంగుళూరుకు దగ్గర్లోనే 8,000 ఎకరాల భూమి!
లేపాక్షి-మడకశిర ప్రాంతం బెంగుళూరుకు కేవలం గంట దూరంలో ఉంది. ఇక్కడే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏయిరోస్పేస్ పార్క్‌ కోసం భూమిని సిద్ధం చేసింది. అంతేకాదు, తక్కువ సమయంలో నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పవర్, రోడ్డు కనెక్టివిటీ, మానవ వనరులు కూడా ఇప్పటికే లభ్యం.

బెస్ట్-ఇన్-క్లాస్ పాలసీతో దూసుకెళ్తున్న ఏపీ
ఏయిరోస్పేస్ రంగానికి అత్యుత్తమ విధానాలు కలిగిన పాలసీని ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో ట్యాక్స్ రాయితీలు, సబ్‌సిడీలు, సింగిల్ విండో క్లియరెన్స్, అనుమతుల వేగవంతమైన ప్రక్రియ వంటి అంశాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, స్టార్టప్‌లు, MSMEలు, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు.

లీడర్షిప్ లో స్పష్టత.. వ్యూహాల్లో దూకుడే!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే HAL వంటి సంస్థల కోసం లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని వినియోగించేందుకు ప్రణాళిక ప్రకటించారు. నారా లోకేష్ ఇప్పుడు అదే దిశగా కంపెనీలకు ఆహ్వానం పంపడం వెనుక, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు లాగడం లక్ష్యం. దీనివల్ల కేవలం ఉపాధి అవకాశాలే కాదు.. డిఫెన్స్, రిసెర్చ్, మానవ వనరుల పరంగా ఏపీ కీలక కేంద్రంగా మారనుంది.

కర్ణాటకలో చిచ్చు.. ఏపీలో అవకాశమే అవకాశాలు!
ఏపీలో ప్రకటించిన ఈ 8,000 ఎకరాల భూమి ప్రాజెక్ట్‌తో సంబంధించి, ఇప్పటికే అనేక సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఎటు చూసినా, AP ప్రస్తుతం వ్యూహాత్మకంగా వ్యాపార అవకాశాల్ని ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ఇది కేవలం ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి ఒక పెద్ద మెట్టు కూడా.

ఏయిరోస్పేస్ రంగంలో ఎక్కడ ప్రతిభ చూపించగలిగితే.. అక్కడే పెట్టుబడులు ఉంటాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని చూసిన రాష్ట్రం ఏపీయే. కర్ణాటక రైతుల పోరాటం ప్రాజెక్ట్‌ను ఆపేసింది కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అది బంగారు అవకాశంగా మారింది. 8,000 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది. కంపెనీలకు వేచి చూస్తున్న ప్రోత్సాహకాలు ఇవన్నీ కలిస్తే, ఏపీకి ‘ఇండియా ఏరోస్పేస్ హబ్’ అనే పేరును తీసుకురావడంలో సందేహం లేదు.

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×