E-Paper
Advertisement

Mgnrega Workers: ఏపీలో వారికి పండగే.. అకౌంట్‌‌ల్లోకి డబ్బులు జమ

Mgnrega Workers: ఏపీలో వారికి పండగే.. అకౌంట్‌‌ల్లోకి డబ్బులు జమ
Advertisement

Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. పెండింగ్ లో నిధులను విడుదల చేసింది. రేపో మాపో కూలీల బ్యాంకు అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ సెక్షనాఫ్ వర్గానికి ఇదొక శుభవార్త.

ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు చెప్పింది కూటమి సర్కార్. ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ నిధుల బిల్లుల చెల్లింపులు మొదలయ్యాయి. 528 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వారి వారి ఖాతాల్లో జమ చేసింది.

Advertisement

మిగతా రూ.178 కోట్లు నిధులను రేపో మాపో విడుదల చేయనుంది. 10 రోజుల్లో మిగిలిన మరో రూ.672 కోట్లు విడుదల కానున్నాయి. కేంద్రం నిధులు చెల్లింపులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కేంద్రంతో చంద్రబాబు సర్కార్ చర్చించిన తర్వాత రూ.900 కోట్లు నిధులు విడుదలయ్యాయి.

ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను కలిపి ప్రస్తుతం ఈ డబ్బులు చెల్లింపులు చేస్తోంది.2014-19లో టీడీపీ హయాంలో చేసిన పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులను చెల్లిస్తోంది.

Advertisement

ALSO READ: జగన్ కి అదొక్కటే దిక్కా? పాదయాత్రపైనే భారమంతా

ప్రభుత్వ అధికార వర్గాల సమాచారం మేరకు మంగళవారం ఒక్కరోజు రూ.100 కోట్ల బిల్లులు చెల్లించారు. అలాగే గోకులాల పనులకు రూ.200 కోట్లు విడుదల చేశారు. వీటికితోడు రోడ్లు, కాలువల పనులకు మరో రూ.228 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించినట్లు వెల్లడించాయి. ఇదిలాఉండగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీ వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొత్తగా 2,260 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనుంది. దీనికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర సంస్థ నిధుల నుంచి ఆయా వాహనాలను కోనుగోలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది.

ప్రస్తుతం ఆ రుసుమును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పాత వాహనాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. స్వచ్ఛాంధ్ర సంస్థ దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. ఆయా సంస్థలతో మాట్లాడి తర్వాత ధరను నిర్ణయించనుంది.

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×